"అఖండ 2" కథ మొత్తం రెడీ... ఆ పాత్ర కోసం తీవ్ర వెతుకులాట..!

Pulgam Srinivas
నందమూరి బాలకృష్ణ 2021 వ సంవత్సరం అఖండ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన మాస్ ఇమేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా... మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి ప్రగ్యా జైస్వాల్ ఈ సినిమాలో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటించింది. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించిన ఈ మూవీ ని ద్వారక క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మించారు.

ఇకపోతే ఈ మూవీ లో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రల్లో నటించాడు. ఒక పాత్రలో రైతు గాను , మరొక పాత్రలో అఘోర గాను నటించి రెండు పాత్రలలోనూ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇకపోతే ఈ సినిమా అద్భుతమైన విజయం అందుకుంది. ఈ మూవీలోని బాలకృష్ణ నటనకు గాను ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ కావడంతో ఆ తర్వాత కొన్ని రోజులకే ఈ సినిమాకు కొనసాగింపుగా అఖండ 2 ఉంటుంది అని ఈ మూవీ హీరో , దర్శకుడు ఇద్దరు కూడా ప్రకటించారు. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే బోయపాటి శ్రీను "అఖండ 2" కు సంబంధించిన మొత్తం కథ పూర్తి అయ్యింది అని , ప్రస్తుతం బాలకృష్ణ గారు రాజకీయ పనులతో బిజీగా ఉన్నారు అని , ఎలక్షన్స్ పూర్తి కాగానే అఖండ 2 సినిమాను మొదలు పెడతాం అని చెప్పారు. ఇకపోతే ఎలక్షన్ లు పూర్తి అయ్యాయి.

దానితో ఎప్పుడు ఈ సినిమా స్టార్ట్ అవుతుందా అని బాలయ్య అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను బోయపాటి మొదలు పెట్టాడు అని , అందులో భాగంగా ఈ మూవీలో ఎంతో కీలకమైన విలన్ పాత్ర కోసం వెతుకులాడుతున్నట్లు అందులో భాగంగా ఇప్పటికే సంజయ్ దత్ , బాబి డియోల్ వంటి స్టార్స్ ను సంప్రదించినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: