ట్రైలర్: మనమే ట్రైలర్ తో హిట్టు కొట్టేలా ఉన్న కృతి.. శర్వానంద్..!

Divya
టాలీవుడ్ హీరో శర్వానంద్, హీరోయిన్ కృతి శెట్టి కాంబినేషన్లో వస్తున్న చిత్రం మనమే. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. దాదాపుగా కృతి శెట్టి సరైన సక్సెస్ అందక కొన్ని సంవత్సరాలు పైనే అవుతోంది. ప్రస్తుతం మనమే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం సాంగ్స్ టీజర్ ని కూడా విడుదల చేసి ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా చేసింది. ఇప్పుడు తాజాగా ట్రైలర్ను కూడా విడుదల చేసింది చిత్రబృందం.

తాజాగా విడుదలైన మనమే సినిమా ట్రైలర్ చూస్తే ఈ సినిమా కథ మొత్తం ఒక చిన్న పిల్లాడి చుట్టూ తిరుగుతున్నట్లుగా కనిపిస్తుంది. ఈ పిల్లాడిని జాగ్రత్తగా చూసుకోవడానికి శర్వానంద్ శెట్టి పడే కష్టాలను ఇందులో చాలా కామెడీగా చూపించారు.. ముఖ్యంగా వీరిద్దరి లైఫ్ లోకి ఆ పిల్లాడు ఎలా వచ్చాడు అసలు ఆ పిల్లోడు ఎవరు అనే విషయం తెలియాలి అంటే ఈ సినిమా చూడాల్సిందే.. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ అయితే వైరల్ గా మారుతోంది. చాలా గ్యాప్ తర్వాత శర్వానంద్ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ట్రైలర్ చూస్తూ ఉంటే ప్రేక్షకులను ఆకట్టుకునేలా కనిపించింది మరి ఈ సినిమాతో కృతి , శర్వా  ఇద్దరూ సక్సెస్ అందుకుంటారేమో చూడాలి మరి.

2022లో వచ్చిన ఒకే ఒక జీవితం సినిమా తర్వాత మరియు సినిమాలో కూడా నటించలేదు.  2 ఏళ్ల గ్యాప్ తర్వాత మనమే అనే సినిమాతో రాబోతున్నారు. వరుస ప్లాపులతో సతమతమవుతున్న కృతి శెట్టికి ఈ సినిమా విజయాన్ని అందించి తెలుగులో మరొక సారి టాలీవుడ్ లో సినిమా అవకాశాలను అందిస్తుందేమో చూడాలి మరి. దీంతో కృతి శెట్టి ఈమధ్య తెలుగు ఇండస్ట్రీని వదిలి కోలీవుడ్ వైపుగా అడుగులు వేసినట్లు తెలుస్తోంది అక్కడ కూడా స్టార్ హీరోలతో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: