పసిబిడ్డ చనిపోతే అలా వ్యాఖ్యలు చేస్తావా... రష్మి పై నిటిజన్ల ఆగ్రహం..!

Pulgam Srinivas
ప్రస్తుతం జబర్దస్త్ కామెడీ షో కు యాంకర్ గా వ్యవహరిస్తూ వరుస సినిమాల్లో నటిస్తున్న రష్మీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ వాటి ద్వారా ఈమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. అలాంటి సమయం లోనే ఈమె జబర్దస్త్ టీవీ షో కు యాంకర్ గా వ్యవహరించడం , ఆ షో సూపర్ సక్సెస్ కావడంతో ఈమెకు అనేక టీవీ షో లలో అవకాశాలు దక్కడం మాత్రమే కాకుండా సినిమాల్లో హీరోయిన్ మరియు ముఖ్య పాత్రలలో కూడా అవకాశాలు దక్కాయి. దాంతో ఈమె ఇప్పటికే ఎన్నో సినిమాలలో తన హాట్ అందాలతో ప్రేక్షకులను అలరించి ఎప్పటికప్పుడు సినిమా అవకాశాలను దక్కించుకుంటూ పర్వాలేదు అనే స్థాయిలో కెరియర్ ను ముందుకు సాగిస్తుంది.

ఇకపోతే ఈమె అప్పుడప్పుడు కొన్ని సంఘటనలపై తనదైన రీతిలో స్పందిస్తూ ఉంటుంది. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఓ పసి బిడ్డను వీధి కుక్క చంపిన ఘటన కలకలం రేపిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇక పోతే వీధి కుక్క పసి బిడ్డను చంపిన ఘటనపై రష్మి స్పందిస్తూ ... బిడ్డపై దాడి జరుగుతుంటే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు ..? అంటూ ఈమె సోషల్ మీడియా వేదికగా స్పందించింది. అలాగే బాధ్యత లేకపోతే పిల్లల్ని కనద్దు అంటూ ఈమె తేల్చి చెప్పింది.

వారే బిడ్డను రిస్క్ లో పెట్టారు అని కూడా ఈమె సోషల్ మీడియా వేదికగా విమర్శించింది. దానితో పలువురు నెటిజన్ లు ఈమెపై ఫైర్ అవుతున్నారు. అన్యం పుణ్యం ఎరగని చిన్న పసి బిడ్డ , కుక్క దాడి వల్ల చనిపోతే నువ్వు పాపం పసి బిడ్డ చనిపోయింది అనకుండా కుక్కను వెనకేసుకొస్తున్నావా అంటూ ఈమె ఫైర్ అవుతున్నారు. అలాగే ఎంతో మంది నటిజన్ లు ఈమెపై రకరకాల కామెంట్స్ పెడుతూ వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: