ఆ క్రేజీ మూవీ షూటింగ్ను పూర్తి చేసుకున్న రజిని..!

Pulgam Srinivas
సూపర్ స్టార్ రజనీ కాంత్ పోయిన సంవత్సరం జైలర్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ సూపర్ సక్సెస్ అందుకోవడం మాత్రమే కాకుండా కోలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక జైలర్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత రజిని తన కూతురు అయినటువంటి ఐశ్వర్య రజనీ కాంత్ దర్శకత్వంలో రూపొందిన లాల్ సలామ్ అనే మూవీ లో ఓ చిన్న పాత్రలో నటించాడు. ఈ మూవీ లో విష్ణు విశాల్ హీరోగా నటించాడు. ఇక జైలర్ లాంటి అద్భుతమైన విజయవంతమైన సినిమా తర్వాత రజిని కీలక పాత్రలో నటించిన మూవీ కావడంతో ఈ మూవీ పై తమిళ ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

కానీ ఈ మూవీ మాత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యింది. చాలా రోజుల క్రితమే రజిని "జై భీమ్" మూవీ ద్వారా అద్భుతమైన దర్శకుడుగా గుర్తింపును సంపాదించుకున్న టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో వెట్టయాన్ అనే సినిమాలో స్టార్ట్ చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అమితా బచ్చన్ , టాలీవుడ్ యువ నటుడు అయినటువంటి దగ్గుపాటి రానా , మలయాళ స్టార్ నటులలో ఒకరు అయినటువంటి ఫాహధ్ ఫాజిల్ కీలక పాత్రలలో కనిపించనున్నారు.

ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే తాజాగా ఈ మూవీ లో రజిని పాత్రకు సంబంధించిన షూటింగ్ పోర్షన్ కంప్లీట్ అయింది. ఈ విషయాన్ని ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించడం మాత్రమే కాకుండా రజిని గారు ఈ సినిమా షూటింగ్ లో ఎంతో ఓపికతో , సహనంతో పాల్గొన్నారు. ఈ సినిమా షూటింగ్ ఎంతో సజావుగా జరిగింది. తాజాగా ఆయనకు సంబంధించిన పోర్షన్ షూటింగ్ కంప్లీట్ అయింది. ఆయనకు ఆనందంగా వీడ్కోలు పలుకుతున్నాం అని ఈ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని కూడా మేకర్స్ ప్రకటించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: