పిఠాపురం నేను వెళ్లడం లేదు... చిరు..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి నిన్న ఢిల్లీ లో పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ పురస్కారం తీసుకోవడం కోసం ఢిల్లీ వెళ్ళిన చిరంజీవి తిరిగి ఈ రోజు హైదరాబాద్ కి వచ్చారు. ఇక హైదరాబాదు కు రాగానే ఈయన ను ఎయిర్ పోర్ట్ లో అనేక మంది పాత్రికేయులు ఎన్నో ప్రశ్నలు అడిగారు. అందులో భాగంగా మీరు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , పిఠాపురం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కదా ..? ఆయనకు సపోర్టుగా నిలబడడం కోసం ఆ ప్రాంతంలో ప్రచారాలని చేయనున్నారా అనే ప్రశ్నను అడిగారు.

దీనికి చిరంజీవి సమాధానం ఇస్తూ ... నేను పవన్ కళ్యాణ్ కు సపోర్టు గా ప్రచారం చేయడానికి పిఠాపురం కు వెళ్లడం లేదు. మొదటి నుండి అనేక మంది నేను పిఠాపురం కు వెళ్లి ప్రచారం చేయబోతున్నాను అని వార్తలు రాస్తున్నారు. అది నాకు ఏ మాత్రం సంబంధం లేని విషయం. దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇకపోతే పవన్ కళ్యాణ్ నా తమ్ముడు. అతను ఎంతో గొప్ప జీవితాన్ని వదులుకొని ప్రజలకు మంచి చేయడం కోసం ఓ పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వచ్చాడు.

అలాంటి వ్యక్తి గెలిస్తే ప్రజలకు మంచి జరుగుద్ది అనే ఉద్దేశంతో అతనికి సపోర్ట్ చేయండి , అతని గెలిపించండి అని ఒక వీడియో చేసి పెట్టాను. కాకపోతే నేను పిఠాపురం వెళ్లి ప్రత్యక్షంగా పవన్ కళ్యాణ్ కు ఓటు వేయండి అని అడగను అని తాజాగా చిరంజీవి చెప్పుకొచ్చాడు. ఇకపోతే చిరంజీవి తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ గా మారాయి. ఇకపోతే చిరంజీవి కొన్ని రోజుల క్రితం పవన్ కళ్యాణ్ ను అతని పార్టీని సపోర్ట్ చేయండి అంటూ పోస్ట్ చేసిన వీడియో కూడా చాలా వైరల్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: