మావయ్యా.... అని నోరారా పిలుస్తూ.. మెగాస్టార్ కు ఉపాసన సరదా ప్రశ్న..!!

murali krishna
ఉపాసన ..మెగా కోడలుగా బాగా పాపులారిటీ సంపాదించుకుంది . మెగా కోడలు కాకముందు కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . రాంచరణ్ భార్య అయిన తర్వాత మెగా కోడలు ఉపాసన సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటూ వస్తుందో మనకు తెలిసిందే.రీసెంట్ గా సోషల్ మీడియా వేదికగా ఉపాసన ఒక సెన్సేషనల్ వీడియోని షేర్ చేసుకుంది. ఈ వీడియో నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది.టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న చిరంజీవికి తాజాగా పద్మవిభూషణ్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి నిన్న రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతులు మీదుగా పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నాడు.అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మ విభూషణ్ పురస్కారాన్ని సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి నిన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. భారత రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకోవడానికి ముందు మెగాస్టార్ చిరంజీవికి, మెగా కోడలు ఉపాసన కొణిదెల కు మధ్య ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది.ఇక ఆ సన్నివేశం తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది.మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ పురస్కారాన్ని తీసుకోవడానికి ముందు చిరంజీవికి, ఉపాసనకు మధ్య ఒక సరదా సంభాషణ జరిగింది. ఆ సంభాషణలో మెగా కోడలు ఉపాసన చిరంజీవికి ఒక ప్రశ్న సంధించారు. మావయ్య క్లీంకారకు, నాకు మధ్య ఉన్న కామన్ పాయింట్ ఏంటో చెప్పండి అంటూ చిరంజీవిని ఉపాసన ప్రశ్నించారు. దీనికి ఒక క్షణం ఆలోచించిన చిరంజీవి క్లీంకార నీకు ప్రతిరూపం అంటూ వ్యాఖ్యానించారు.దానికి ఉపాసన వెంటనే నో..మావయ్య... మేమిద్దరం... పద్మ విభూషణ్ ల మరవరాళ్ళం అంటూ నవ్వుతూ చెప్పారు. ఇది విన్న చిరంజీవి కూడా నిజమే కదూ అంటూ పేర్కొన్నారు. ఉపాసన తాతగారైన ప్రతాప్ సి. రెడ్డి గారికి 2010లో పద్మ విభూషణ్ అవార్డు వచ్చిన విషయాన్ని చిరంజీవి ఉపాసన వ్యాఖ్యలతో గుర్తుచేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: