రీ ఎంట్రీ కి రెడీ అయిన "మన్మధుడు" బ్యూటీ..?

Pulgam Srinivas
ప్రతి సంవత్సరం ఎంతో మంది హీరోయిన్ లు ఇండస్ట్రీ కి వస్తూ ఉంటారు. వారిలో కొంత మంది చాలా తక్కువ సమయం లోనే మంచి గుర్తింపును సంపాదించుకుంటారు. కానీ ఆ తర్వాత మాత్రం ఆ క్రేజ్ ను అలా కంటిన్యూ చేయడంలో ఫెయిల్ అవుతుంటారు. అలాంటి వారిలో అన్షు ఒకరు. ఈమె టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరో గా రూపొందిన మన్మధుడు సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది.

అలాగే ఇందులో ఈమె తన నటనతో , అంద చందాలతో ప్రేక్షకులను కట్టి పడేయడంతో ఈ మూవీ ద్వారా ఈ బ్యూటీ కి తెలుగు లో అద్భుతమైన గుర్తింపు లభించింది. ఇక మన్మధుడు సినిమా సూపర్ సక్సెస్ కావడం తో ఆ వెంటనే ఈమె కు రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా రూపొందిన రాఘవేంద్ర సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక రాఘవేంద్ర సినిమా తర్వాత ఈమె సినిమా అవకాశాలను దక్కించుకోవడంలో చాలా వెనుకబడిపోయింది.

మెల్ల మెల్లగా ఈమె సినిమా ఇండస్ట్రీ కే దూరం అయింది. కానీ మళ్ళీ అన్షు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మరి కొన్ని రోజుల్లోనే సందీప్ కిషన్ హీరోగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో "ఎస్ కే 30" అనే మూవీ స్టార్ట్ కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో అన్షు ను ఓ కీలక పాత్రలో తీసుకోవాలి అని మేకర్స్ అనుకుంటున్నట్లు , అందులో భాగంగా ఈమెను కలిసి ఇప్పటికే కథను వినిపించినట్లు కథ మొత్తం విన్న ఈమె ఈ బ్యూటీ కూడా ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: