ఆ తేదీన ఓటిటి లో "చిత్రం చూడరా"..!

MADDIBOINA AJAY KUMAR
వరుణ్ సందేశ్ హీరో గా చేసిన రీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ "చిత్రం చూడరా" అనే మూవీ రూపొందింది. ఆర్.ఎన్ హర్ష వర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అన్నపూర్ణమ్మ , రవిబాబు , తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటించబోతున్నారు. వీరితో పాటు ఈ మూవీ లో శీతల్ భట్ , విక్కీ దేవ్ , ధన్ రాజ్ , మీనా కుమారి , శివాజీ రాజా , రైజింగ్ రాజు , కేఏ పాల్ రాము , రచ్చ రవి , రాజా రవీంద్ర , సతీష్ సరిపల్లి , పింగ్ పాంగ్ సూర్య , కాశీ విశ్వనాథన్ లు ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు.
 

ఇకపోతే ఈ మూవీ థియేటర్ లలో కాకుండా నేరుగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల కాబోతుంది. మరి ఈ మూవీ ఏ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది ... ఏ తేదీ నుండి "ఓ టి టి" లోకి అందుబాటులోకి రాబోతుంది అనే విషయాలను తెలుసుకుందాం. ఈ మూవీ నేరుగా ఈటీవీ విన్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని ఈటీవీ విన్ ఓ టి టి ఫ్లాట్ ఫామ్ వారు తాజాగా ప్రకటించారు.

ఇకపోతే ఈ సినిమా ఈటీవీ విన్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో మే 9 వ తేదీ నుండి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని ఈ సంస్థ వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గత కొంత కాలంగా వరుణ్ సందేశ్ నటించిన ఏ సినిమా కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. మరి నేరుగా ఓ టి టి లో విడుదల కాబోతున్న చిత్రం చూడరా సినిమా అయినా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందేమో తెలియాలి అంటే మే 9 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

vs

సంబంధిత వార్తలు: