హరిహర వీరమల్లు` నుంచి క్రిష్‌ తప్పుకోవడానికి కారణం ఇదేనా..??

murali krishna
డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా పాన్ ఇండియా పీరియాడిక్ సినిమా హరిహర వీరమల్లు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.పవన్ పొలిటికల్ బిజీ వల్ల ఈ సినిమా సాగుతూ వస్తుంది. భారీ బడ్జెట్ సినిమా, ఎక్కువ షూటింగ్ డేట్స్ ఉన్న సినిమా కావడంతో హరిహర వీరమల్లు మూడేళ్ళ క్రితం అనౌన్స్ చేసినా ఇంకా లేట్ అవుతూనే ఉంది. అయితే గత కొంతకాలంగా ఈ ప్రాజెక్టు యాక్టివ్ అయింది.వరుసగా పోస్టర్స్ రిలీజ్ చేస్తూ, అప్డేట్స్ ఇస్తున్నారు. తాజాగా నేడు హరిహర వీరమల్లు టీజర్ కూడా రిలీజ్ చేశారు. టీజర్ అయితే అదిరిపోయింది. పవన్ యాక్షన్ సీక్వెన్స్ ల సూపర్ ఉన్నాయి. అయితే టీజర్ అనౌన్స్మెంట్ పోస్టర్స్ మీద డైరెక్టర్ క్రిష్ పేరు లేకపోవడంతో డైరెక్టర్ క్రిష్ ని ఈ ప్రాజెక్టు నుంచి తప్పించారని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ విషయంలో ఓ క్లారిటీ వచ్చింది. క్రిష్‌ని తప్పించలేదు, అతడే స్వయంగా తప్పుకున్నాడని చిత్ర యూనిట్ టీజర్ రిలీజ్ సందర్భంగా తెలిపింది.

క్రిష్ వేరే సినిమాతో బిజీగా ఉండడంతో.. ఆయన పర్యవేక్షణలో ఈ సినిమా నిర్మాత ఏఎమ్‌ రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ మిగిలిన షూటింగ్ పూర్తి చేస్తారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా క్రిష్ పర్యవేక్షణలో పూర్తి చేయబోతున్నారు. ఇప్పుడు డైరెక్టర్ పేర్లలో క్రిష్ సహా జ్యోతి కృష్ణ పేరు కూడా ఉంది.అయితే ఈ సందర్భంగా దర్శకుడిగా కొత్త పేరుని వెల్లడించింది టీమ్‌. జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకుంటాడని, మిగిలిన షూటింగ్‌ పార్ట్ కి అతనే డైరెక్ట్ చేస్తాడని, క్రిష్‌ పర్యవేక్షణలో జరుగుతుందని తెలిపారు.మరి దర్శకుడిగా క్రిష్‌ తప్పుకోవడానికి కారణం ఏంటనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ గా మారింది. అనేక అనుమానాలకు తావిస్తుంది. ఈ సినిమాకి సంబంధించి మొదట్నుంచి క్రియేటివ్‌ డిఫరెంట్స్ వస్తుందనే వార్తలు వచ్చాయి. 

పవన్ కళ్యాణ్‌కి, క్రిష్‌కి మధ్య క్రియేటివ్‌ డిఫరెంట్స్ వస్తున్నాయనే ప్రచారం జరిగింది. స్క్రిప్ట్ లో పవన్‌ కొన్ని మార్పులు చెప్పారని, దానికి క్రిష్‌ నో చెప్పాడని తెలిసింది. తన మాట వినకపోవడం వల్లే పవన్‌ ఈ సినిమా విషయంలో కాస్త నిర్లక్ష్యంగా ఉన్నాడనే ప్రచారం కూడా జరిగింది.ఇదిలా ఉంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన దర్శకుడు జ్యోతికృష్ణ ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరం. ఆయన ఎనక్కు 20 ఉనక్కు 18, నీ మనసు నాకు తెలుసు, ఆక్సిజన్, రూల్స్ రంజాన్‌ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన జ్యోతి కృష్ణ ఈ మూవీ మిగిలిన పార్ట్ డైరెక్ట్ చేయబోతున్నారు. ఆయన ఎవరో కాదు హరిహర వీరమల్లు నిర్మాత ఏఎం రత్నం కొడుకు కావడం విశేషం. మరి సక్సెస్‌లు లేని జ్యోతికృష్ణ ఈ మూవీని డీల్‌ చేస్తాడా? అనేది పెద్ద ప్రశ్న. ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: