"టిల్లు క్యూబ్" లో ఛాన్స్ కొట్టేసిన పూజా హెగ్డే..?

Pulgam Srinivas
టాలీవుడ్ యువ నటుడు సిద్దు జోన్నలగడ్డ 2022 వ సంవత్సరం డీజే టిల్లు అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ లో నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా ... సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మించాడు. మామూలు అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయం అందుకుంది. దానితో ఒక్క సారిగా సిద్దు కు తెలుగులో క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది.

ఏ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈ సినిమాకు కొనసాగింపుగా టిల్లు స్క్వేర్ అనే సినిమాను రూపొందించారు. ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా ... నేహా శెట్టి ఓ ముఖ్యమైన పాత్రలో నటించింది. మల్లిక్ రామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సూర్య దేవర నాగ వంశీ నిర్మించాడు. మార్చి 29 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయం అందుకొని 125 కోట్ల కు పైగా కలెక్షన్ లను రాబట్టి భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. దానితో ఈ మూవీ కి కొనసాగింపుగా టిల్లు క్యూబ్ అనే మూవీ ని రూపొందించబోతున్నట్లు ఈ మూవీ యూనిట్ ప్రకటించింది. ఇకపోతే ఈ సినిమాలో ఇప్పటికే హీరోయిన్ ని కూడా సెలెక్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

అసలు విషయం లోకి వెళితే ... టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించబోతున్నట్లు ఇప్పటికే ఈ సినిమా విషయమై మేకర్స్ ఈ బ్యూటీ ని సంప్రదించగా ఈమె కూడా ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు , మరికొన్ని రోజుల్లోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: