ఆ పార్ట్ కు సర్జరీ చేయించుకున్న సాయి పల్లవి..!!

murali krishna
టాలీవుడ్ స్టార్బ్యూటీ సాయి పల్లవికి తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. లేడీ సూపర్ స్టార్ గా స్టార్ హీరోకు ఉండే రేంజ్ లో క్రేజ్‌ సంపాదించుకుంది ఈ అమ్మడు.సినిమా.. ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ అందం ఉంటేనే రోజులు. ముఖ్యంగా హీరోయిన్స్ కు అయితే వయస్సు పెరిగినా అందం తరగకూడదు. అలా ఉంటేనే అవకాశాలు వస్తాయి.అందాల సుందరి సాయి పల్లవి పేరు చెప్తేనే ఎక్కడ లేని పాజిటివ్ నెస్ వచ్చేస్తుంది. ఆమె చేసిన పాత్రలే ఇందుకు కారణం. కాగా మొదటి నుంచి కూడా బోల్డ్ టచ్ లేకుండా సాఫ్ట్ గా హ్యాండిల్ చేస్తూ వచ్చింది.
ఎక్స్ పోజింగ్ కు దూరంగా ఉంది. దీంతో అందరూ మన ఇంట్లో అమ్మాయి అనుకునేంత దగ్గరైపోయింది.అందాల ఆరబోత చేయాలి. ముఖం అంతా నున్నగా ఉండాలి. ముక్కు, మూతి వంకర్లు ఉండకూడదు.. ఏదైనా ఉంటె సర్జరీ చేయించుకోని సరిచేసుకోవాలి. రోజు జిమ్ చేసి బరువు పెరగకుండా చూసుకోవాలి. ఇలాంటి ఆంక్షలు ఉన్న ఇండస్ట్రీకి సాయిపల్లవి వచ్చింది. ఇలాంటివేమీ పట్టించుకోకుండా తనకు ఎలా నచ్చితే అలా ఉంది. మొదటి సినిమా ప్రేమమ్ లో ఆమెను చూసి అందరూ నవ్వుకున్నారు.. ట్రోల్ చేశారు.
ముఖం నిండా మొటిమలు ఉన్నాయి.. ఈమె హీరోయినా.. ? అన్నారు. మచ్చల హీరోయిన్ అని విమర్శించారు. ఇలాంటివేమీ ఆమె పట్టించుకోకుండా కేవలం నటనతోనే స్టార్ హీరోయిన్ లిస్ట్ లో చేరింది. ఇప్పటివరకు ఎలాంటి ఫేస్ క్రీమ్స్ కూడా ఆమె వాడనుకూడా లేదట.ఇప్పుడున్న హీరోయిన్స్ అంతా ఓ ఎత్తైతే.. సాయి పల్లవి వారందరికంటే కూడా డిఫరెంట్ అని చెప్పి తీరాలి.. అటు తెరపైన ఎంత హుందాగా పద్దతిగా అయితే కనిపిస్తుందో తెర వెనుక కూడా అలానే ఉంటుంది ఈ అమ్మడు. సోషల్ మీడియాలో నిత్యం కనిపించకపోయినా.. అప్పుడప్పుడు దర్శనం ఇచ్చినా కూడా ఆమె ఫోటోలు క్షణాల్లో వైరల్ అయిపోతూ ఉంటాయి. సాయి పల్లవిని లేడీ పవర్ స్టార్ అని కూడా అంటూ ఉంటారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా ఈ అమ్మడు తన అందం గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో 'మీ ముఖం మీద మొటిమలు మాయం అయ్యాయి. సర్జరీ చేయించుకున్నారా?' అని యాంకర్ ప్రశ్నించింది.
దీనిపై నవ్వుతూ సమాధానమిచ్చిన సాయి పల్లవి.. 'అమ్మాయిల వయసును బట్టి మొటిమలు వస్తూ పోతూ ఉంటాయి. దానికి సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. నిజానికి నా ఫస్ట్ సినిమాలో ఛాన్స్ వాటి వల్లే వచ్చింది. ఉన్నా నాకు ప్రాబ్లమ్ లేదు' అని చెప్పుకొచ్చింది.ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాటంతట ఏవ్ పోతాయంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ..
అలాగే తన ఒత్తయిన కురుల గురించి చెబుతూ తానూ ఆర్గానిక్ ఆహారపదార్ధాలను తింటాననని.. అలోవెరా జెల్ ఉపయోగిస్తానని చెప్పుకొచ్చింది. దీనితో ఈ విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతున్నాయి. ఇక దీనిని చూసిన నెటిజన్లు ఇందుకు కదా ఆమెను న్యాచురల్ బ్యూటీ అనేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజమే కదా మరీ.ప్రస్తుతం సాయి పల్లవి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవ్వడంతో మీరు ఎంత డీసెంట్ పాత్రలో నటిస్తారో.. ఎలాంటి పాత్రలకు ఇంపార్టెన్స్ ఇస్తారా అందరికీ తెలుసు. మీలాంటి నటులపై ఇలాంటి చెత్త రూమర్స్ క్రియేట్ అయిన ఎవరు నమ్మరు అంటూ.. తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం నాగ చైతన్య తండేల్‌ సినిమాతో పాటు బాలీవుడ్ లోనూ పలు సినిమాల్లో బిజీగా ఉంది. అంతేకాదు నితిష్ తివారి డైరెక్షన్లో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఇతిహాస గాధ రామాయణంలోనూ సాయిపల్లవి సీతగా నటిస్తుంది. దీనికి సంబంధించిన పిక్స్ ఇటీవల లీక్ అయి తెగ వైరల్ గా మారాయి. దీంతో ఈమె లుక్ అమేజింగ్ అంటూ సీత గెటప్ మీకు చాలా బాగా సెట్ అయింది అంటూ తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: