శివాజీ తో అలాంటి సీన్స్ చేయడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన నటి అర్చన..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటిగా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది నటి అర్చన. హీరోయిన్ గా తన సినీ కెరియర్ నీ ప్రారంభించిన ఈమె హీరోయిన్గా గుర్తింపు దక్కకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మిగిలిపోయింది. కొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించింది. అయితే నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఖలేజా శ్రీరామదాసు కమలతో నా ప్రయాణం వంటి సినిమాల్లో నటించి గుర్తింపు సంపాదించుకుంది ఈ బ్యూటీ. అవసరమైన మీరకో సినిమాల్లో గ్లామర్ పాత్రల్లో కూడా కనిపించింది. అయితే కమలతో నా ప్రయాణం అనే సినిమాలో ఈ బ్యూటీ వేశ్య పాత్రలో నటించిన వివాహం తర్వాత బ్రేక్ ఇచ్చింది.

అయితే ఆ మధ్య పలు ఇంటర్వ్యూలో పాల్గొన్న అర్చన తను నటించిన సినిమాలో బోల్డ్ సన్నివేశాల గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. దీంతో నటి అరిచిన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే గతంలో హీరోగా మంచి పేరు సంపాదించుకున్న నటుడు శివాజీ ఇటీవల బిగ్ బాస్ షో తో మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ మధ్యకాలంలో 90s మిడిల్ క్లాస్ బయోపిక్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సీరీస్ ఎంతటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నటి అర్చన శివాజీ పై షాకింగ్ కామెంట్స్ చేసింది..

అదేంటంటే.. శివాజితో కమలతో నా ప్రయాణం చిత్రంలో అర్చన చాలా బోల్డ్ సీన్స్ చేసింది... నేను సినిమాల్లో చాలా బోల్డ్ సీన్స్ చేశాను. ఒక్కసారి కూడా రొమాంటిక్ గా ఫీల్ కాలేదు. అక్కడ పరిస్థితులు అలా ఉంటాయి.  శివాజితో బోల్డ్ సీన్స్ ముందే ప్రాక్టీస్ చేసేదాన్ని. ఎందుకంటే షూటింగ్ ఓ సింగిల్ టేక్ లో కంప్లీట్ కావాలి కాబట్టి. ఇద్దరం మాట్లాడుకుని ఇలా చేద్దాం అని సీన్ కంపోజ్ చేసుకునేవాళ్లం. కమలతో నా ప్రయాణం చిత్రంలో బోల్డ్ సీన్స్ మొత్తం సింగిల్ టేక్ లో ఒకే అయ్యేవి. ఇతర నటీనటులు రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు ఎలా ఫీల్ అవుతారో నాకు తెలియదు. నా వరకు అది జస్ట్ సీన్ మాత్రమే అని అర్చన తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: