అలాంటి పాత్రలో నటించడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన శోభిత..!?

Anilkumar
ఇప్పటికే తెలుగు హిందీలో అనేక సినిమాల్లో హీరోయిన్గా నటించిన శోభిత ధూళిపాళ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇన్నాళ్లు హిందీ తెలుగు సినిమాలో నటించిన ఈ బ్యూటీ ఇప్పుడు హాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అంతేకాదు ఇటీవల ఆమె హాలీవుడ్ లో ఒక సినిమాలో కీలక పాత్రలో కూడా కనిపించింది. కాగా ఈ సినిమా దేవ్ పాటిల్ దర్శకత్వంలో వచ్చింది. ఇక ఆయన దర్శకత్వం వహించడమే కాకుండా ఒక కీలక పాత్రలో కూడా కనిపించారు. అయితే ఇందులో సికిందర్ కేర్ సైతం ఒక కీలక పాత్రలో మెరిసారు. ఏప్రిల్ 5న

అమెరికాలో విడుదల అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ సైతం జోరుగా జరుగుతున్నాయి. అయితే ఇందులో శోభిత ఒక వేష పాత్రలో కనిపించింది తాజాగా తన పాత్ర పై షాకింగ్ కామెంట్స్ చేసింది శోభి.త దీంతో ఆమె చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సందర్భంగా ఆ ఇంటర్వ్యూలో మాట్లాడిన శోభిత ఈ సినిమాలో వేశ్య పాత్రలో నటించినందుకు చాలా గౌరవంగా ఉంది అంటూ వెల్లడించింది.  న్యూయార్క్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శోభిత మాట్లాడుతూ..

'మంకీ మ్యాన్ లో సీత అనే వేశ్య పాత్రలో నటించాను.. ఇలాంటి వైవిధ్యమైన పాత్రలో నటించినందుకు నాకు చాలా గౌరవంగా ఉంది. పైగా ఈ లో నా పాత్రకు అధిక ప్రాధాన్యం ఉంది. ప్రేక్షకుల ఆదరణ అందుకుంటుందని ఆశిస్తున్నాను ' అని అన్నారు. ఈ తోనే దేవ్ పాటిల్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఇటీవల శోభిత గురించి దేవ్ పాటిల్ మాట్లాడుతూ ఆమె అందమైన హీరోయిన్ మాత్రమే కాకుండా గొప్ప నటి అంటూ ప్రశంసలు కురిపించాడు. ఇదిలా ఉంటే.. తెలుగమ్మాయి శోభిత.. హిందీ ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత అడివి శేష్ తెరకెక్కించిన గూఢచారి తో తెలుగు తెరకు పరిచయమైంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: