ఆ తేదీన విజయ్ బ్లాక్ బస్టర్ మూవీ రీ రిలీస్..!

Pulgam Srinivas
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ "గిల్లీ" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ 2003 వ సంవత్సరం విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ ను ఊచకోత కోసిన ఒక్కడు మూవీ కి అధికారికా రీమేక్ గా రూపొందింది. గిల్లి మూవీ లో త్రిష హీరోయిన్ గా నటించగా ... ధరణి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ప్రకాష్ రాజు విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ 16 ఏప్రిల్ 2004 వ సంవత్సరం విడుదల అయ్యింది.

8 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఆ సమయంలో 50 కోట్లకు పైగా కలెక్షన్ లను వసూలు చేసి తమిళ ఇండస్ట్రీ లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం తో విజయ్ కి కోలీవుడ్ లో సరికొత్త క్రేజ్ ఏర్పడింది. ఆ టైమ్ లో సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న ఈ సినిమాని ఈ నెల 20 వ తేదీన రి రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

మెగా సూర్య ప్రొడక్షన్ హౌస్ వారు ఈ మూవీ రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ వార్త విజయ్ అభిమానులను ఉత్సాహపరుస్తోంది. అంతటి బ్లాక్ బస్టర్ సినిమాని ఇప్పటి టెక్నాలజీతో 4 k వెర్షన్ లో చూడడానికి విజయ్ అభిమానులు ఉత్సాహపడుతున్నారు. మరి ఆ సమయంలో బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను అందుకొని విజయ్ కి అద్భుతమైన క్రేజ్ ను తీసుకువచ్చిన ఈ సినిమా రీ రిలీస్ లో భాగంగా కూడా అదే జోష ను బాక్స్ ఆఫీస్ దగ్గర చూపిస్తుందో లేదో చూడాలి. ఇకపోతే గిల్లీ మూవీలో హీరోగా నటించిన విజయ్ కి ఏ స్థాయి గుర్తింపు , క్రేజ్ ఈ మూవీ తో వచ్చిందో ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన త్రిష కి కూడా ఈ మూవీ తో మంచి క్రేజ్ లభించింది. ఈ మూవీ లో విలన్ గా నటించిన ప్రకాష్ రాజ్ కి కూడా ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: