ఆ క్రేజీ బ్యానర్ లో అశోక్ గల్లా నెక్స్ట్ మూవీ..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో పర్వాలేదు అనే స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న యువ నటులలో అశోక్ గల్లా ఒకరు. ఈయన "హీరో" అనే మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ నీది అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ పర్వాలేదు అనే స్థాయి అంచనాల నడమ థియేటర్ లలో విడుదల అయ్యి ఈ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టడం మాత్రమే కాకుండా ఈ మూవీ కూడా ఈ నటుడికి భారీ స్థాయిలో గుర్తింపు తెచ్చి పెట్టలేదు.

ఇక ప్రస్తుతం అశోక్ "దేవకీ నందన వాసుదేవ "అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఈ మూవీ నుండి ఇప్పటికే ఈ చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను కూడా విడుదల చేసింది. వాటికి పర్వాలేదు అనే స్థాయి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే ఈ యువ నటుడు మరో క్రేజీ బ్యానర్ లో ఓ మూవీ ని ఓకే చేశాడు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువబడింది. తన నెక్స్ట్ మూవీ ని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న నిర్మాణ సంస్థలలో ఒకటి అయినటువంటి సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ఈ యువ హీరో చేయబోతున్నాడు.

ఈ మూవ లో శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్ గా కనిపించనుండగా ... ఉద్భవ్ రఘు ఈ మూవీ కి దర్శకత్వం వహించబోతున్నాడు. ఇకపోతే ఈ మూవీ కి సంబంధించిన మరిన్ని వివరాలు మరికొంత కాలంలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది. హీరో మూవీ తో ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయిన ఈ యువ నటుడు ఈ రెండు మూవీ లతో ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: