"గీతాంజలి 2" సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటీమణులలో ఒకరు అయినటువంటి అంజలి కొంత కాలం క్రితం గీతాంజలి అనే హార్రర్ కామెడీ జోనర్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ కి కొనసాగింపుగా తాజాగా ఈ బ్యూటీ గీతాంజలి మళ్లీ వచ్చింది అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. శివ తుర్లపాటి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ని కోన వెంకట్ , ఎం వీ వీ సత్యనారాయణ నిర్మించారు. ఈ మూవీ లో శ్రీనివాస్ రెడ్డి , సత్యం రాజేష్ , షకలక శంకర్ , ఆలీ ,  సత్య , సునీల్ పాత్రలలలో నటించారు.
 

ఈ మూవీ ని ఏప్రిల్ 11 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లను కూడా మొదలు పెట్టారు. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం ఈ సినిమా యొక్క ట్రైలర్ ను విడుదల చేయగా దానికి పర్వాలేదు అనే స్థాయిలో జనాల నుండి రెస్పాన్స్ లభించింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేశారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా తాజాగా విడుదల చేశారు.

ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఎ సర్టిఫికెట్ లభించింది. ఈ విషయాన్ని ఈ చిత్ర బృందం తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇకపోతే ఇప్పటికే గీతాంజలి మూవీ సూపర్ హిట్ విజయాన్ని అందుకోవడంతో ఆ మూవీ కి కొనసాగింపుగా రాబోతున్న మూవీ కావడంతో ఈ సినిమాపై ప్రస్తుతానికి తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: