బుల్లితెర ఆడియన్స్ ను అలరించడానికి రెడీ అయిన మహేష్ లేటెస్ట్ మూవీ..!

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా గుంటూరు కారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో శ్రీ లీల , మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటించ గా ... మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు . రమ్య కృష్ణ , జయరామ్ , ప్రకాష్ రాజ్ , రావు రమేష్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో నటించగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు . చినబాబు , సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మించారు . ఇక పోతే ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భం గా జనవరి 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయ్యింది.

భారీ అంచనా నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. అయినప్పటికీ మహేష్ బాబు కు ఉన్న క్రేజ్ వల్ల ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను భారీ స్థాయిలో అలరించలేకపోయిన ఈ సినిమా ఆ తర్వాత డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చి "ఓ టి టి" ప్రేక్షకులను మాత్రం పరవాలేదు అనే స్థాయిలో ఆకట్టుకుంది.

ఇకపోతే ఈ మూవీ మరికొన్ని రోజుల్లో బుల్లి తెరపై ప్రసారం కానుంది. ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను జెమినీ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సినిమాను ఈ సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా బుల్లి తెరపై ప్రసారం చేయనున్నట్లు జెమినీ సంస్థ వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు. మరి ఈ సినిమా బుల్లి తెర ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: