బుక్ మై షో లో లాస్ట్ 24 గంటల్లో ఆ 5 సినిమాల పరిస్థితి ఇదే..!

Pulgam Srinivas
ప్రస్తుతం ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర టిల్లు స్క్వేర్ ... ది గోట్ లైఫ్ ... గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ . క్రూ ... యువ మూవీ లు ఫుల్ జోష్ ను చూపిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీలకు బుక్ మై షో లో లాస్ట్ 24 గంటల్లో ఎన్ని టికెట్లు అమ్ముడు పోయాయి అనే విషయాలను తెలుసుకుందాం.

సిద్దు జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా మల్లిక్ రామ్ దర్శకత్వంలో రూపొందిన టిల్లు స్క్వేర్ అనే మూవీ తాజాగా మార్చి 29 వ తేదీన థియేటర్ లలో విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ పై మొదటి నుండి ప్రేక్షకుల మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకి తగినట్టుగా ఈ మూవీ కూడా విడుదల అయిన మొదటి షో కే అద్భుతమైన టాక్ ను తెచ్చుకోవడంతో ఈ మూవీ కి బుక్ మై షో లో అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభించింది. దానితో లాస్ట్ 24 గంటల్లో టిల్లు స్క్వేర్ మూవీ కి సంబంధించిన 108.61 కే టికెట్ లు అమ్ముడు పోయాయి.

మలయాళ సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి పృథ్వీరాజ్ సుకుమారన్ తాజాగా "ది గోట్ లైఫ్" అనే వైవిధ్యమైన సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ పై మొదటి నుండి ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. దానితో ఈ మూవీ కి సంబంధించిన టికెట్లు లాస్ట్ 24 గంటల్లో బుక్ మై షో ఆప్ లో 146.61 కే టికెట్ లు అమ్ముడు పోయాయి.

తాజాగా గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ అనే సినిమా విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు లాస్ట్ 24 గంటల్లో బుక్ మై షో యాప్ లో 84.99 కే టికెట్ లు అమ్ముడు పోయాయి.

టాబు , కరీనా కపూర్ , కృతి సనన్ ప్రధాన పాత్రలలో రూపొందిన క్రూ అనే మూవీ కి సంబంధించిన టికెట్లు బుక్ మై షో లో లాస్ట్ 24 గంటల్లో 79.91 కే అమ్ముడు పోయాయి.

యువ అనే మూవీ కి సంబంధించిన టికెట్లు బుక్ మై షో లో లాస్ట్ 24 గంటల్లో 12.15 కే అమ్ముడు పోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: