ఆ ఫ్లాప్ హీరోయిన్ తో సినిమాకి రెడీ అయిన నాగ చైతన్య..!?

Anilkumar
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే కాంబినేషన్లో మరొకసారి సినిమా రాబోతోంది అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే వీరిద్దరి కాంబినేషన్లో పదేళ్ల క్రితం ఒక లైలా కోసం అనే సినిమా వచ్చింది. కాగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలచింది. దాంతో మరొకసారి ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుంది అని తెలిసిన తర్వాత అభిమానులు ఈసారి ఏమవుతుందో అని ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం నాగచైతన్య పూజ హెగ్డే కెరియర్ ఏమాత్రం బాగాలేదు అని చెప్పాలి.

వీరిద్దరూ ఇప్పటికే సినిమాలు చేస్తున్నప్పటికీ ఆ సినిమాలన్నీ కూడా ఫ్లాప్స్ గా మారుతున్నాయి. ఇక నాగచైతన్య విషయానికి వస్తే ఈ యంగ్ హీరో హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది అని చెప్పాలి. ప్రస్తుతం నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ సినిమా థండెల్. ప్రస్తుతం ఆయన చేస్తున్న ఈ సినిమా పైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు. చందు ముండేటి దర్శకత్వంలో గీత ఆర్ట్స్ టు బ్యానర్లో వస్తున్న ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ఫస్ట్ లుక్ కూడా ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. కాగా ఈ సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవి నటిస్తోంది.

దే
విశ్రీ మ్యూజిక్ అందిస్తుండడం తో కచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుంది అని అక్కినేని అభిమానులు అందరూ కూడా భావిస్తున్నారు. కానీ చివరికి ఏం జరుగుతుందో చూడాలి. పూజా విషయానికి వస్తే వరుస ప్లాప్స్ ఆమెను ఇబ్బంది పెడుతున్నాయి. ఈ క్రమంలో చైతు , పూజా కలిసి మరోసారి నటించేందుకు సిద్ధమయ్యారు. ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో నాగచైతన్య ఓ సినిమా చేయబోతున్నారు. ఇందులో చైతూ సరసన హీరోయిన్ గా పూజా హెగ్దేను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ‘భం భోలేనాథ్’ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన కార్తీక్ దండు.. ‘విరూపాక్ష’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. సాయి దుర్గ తేజ్, సంయుక్త మీనన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: