పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని ఉంది.. మృనాల్ ఠాకూర్ షాకింగ్ కామెంట్స్..!?

Anilkumar
ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్గా మారిపోయింది మృణల్ ఠాగూర్. బాలీవుడ్ నుండి టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన రుణాలు ఠాగూర్ సీతారామం సినిమాతో పేక్షకుల ముందుకు వచ్చింది. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సీతామహాలక్ష్మి పాత్రలో అద్భుతంగా నటించింది ఈ బ్యూటీ. మొదటి సినిమాతోనే బ్లాక్బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈమె ఆ తర్వాత వరస సినిమాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఈ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మకి సినిమా ఆఫర్స్ క్యూ కట్టాయి. కాగా తాజాగా నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన

 హాయ్ నాన్న సినిమాలో కూడా హీరోయిన్గా నటించిన మెప్పించి. ఇక ఈ సినిమా సైతం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అలా ఈ సినిమాతో కూడా మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు మరొకసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది ఈ ముద్దుగుమ్మ. తెలుగు సినీ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. త్వరలో ఈ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ శరవేగంగా జరుగుతున్నాయి.

కాగా ఇటీవల ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగానే పలు షాకింగ్ విషయాలను వెల్లడించింది ఈమె. మాట్లాడుతు.. రియల్ లైఫ్ ప్రేమ గురించి చెప్పాలంటే.. ఒకసారి ప్రేమలో పడిన తర్వాత..ఆ ప్రేమను మరింత పెంచేందుకు ప్రయత్నించాలి. ఇంకా మిగిలిన వాటి గురించి ఆలోచించకూడదు అని తెలిపింది. నమ్మకం, అనుబంధం అనేవి రెండు వైపులా ఉండాలి. అప్పుడే ఆ రిలేషన్ షిప్ వర్కౌట్ అవుతుంది. నేను ఏ రిలేషన్ షిప్ లోనూ లేను. నాకు ప్రేమలో పడాలని ఉంది. ఇరవై లోనే పెళ్లి చేసుకొని.. పిల్లలను కనాలనిపిస్తుంది. వాళ్ళను తీసుకొని డిన్నర్ కు వెళ్లాలని ఉంది. అంటూ పేర్కొన్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: