రేపు ఆ సమయానికి మగధీర సంధ్య థియేటర్ బుకింగ్స్ ఓపెన్..!

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా టాలెంటెడ్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో కొన్ని సంవత్సరాల క్రితం మగధీర అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా ... ఈ మూ వీకి ఎం ఎం కీరవాణి సంగీతం అందించాడు. ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథను అందించాడు. భారీ అంచనాల నడుమ ధియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే అదిరిపోయే రేంజ్ భారీ బ్లాక్ బస్టర్ టాక్ ను తెచ్చుకుంది.
 

దానితో ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు దక్కాయి. ఇలా ఈ సినిమాకు చాలా రోజుల పాటు సూపర్ సాలిడ్ కలెక్షన్ లు ప్రపంచ వ్యాప్తంగా లభించడంతో ఈ మూవీ ఆ సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇకపోతే రెండవ సినిమాతోనే టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ ను అందుకున్న చరణ్ క్రేజ్ ఈ మూవీ తో ఎక్కడికో వెళ్లిపోయింది. అలాగే కాజల్ అగర్వాల్ క్రేజ్ కూడా ఈ సినిమాతో పిక్స్ కి వెళ్ళిపోయింది. ఇకపోతే ఆ సమయంలో అద్భుతమైన విజయాన్ని సాధించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్ లలో రీ రిలీస్ చేయబోతున్నారు.

ఇకపోతే ఈ సినిమాను ఈ సంవత్సరం చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మార్చి 27 వ తేదీన రీ రిలీజ్ చేయబోతున్నారు. అందులో భాగంగా ఈ మూవీ యొక్క రీ రిలీజ్ కు సంబంధించిన సంధ్య 70mm థియేటర్ టికెట్ బుకింగ్ లను మార్చి 24 వ తేదీన ఆదివారం రోజు మధ్యాహ్నం 10 గంటలకు ఓపెన్ చేయనున్నట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: