జై చిరంజీవలో చిరు మేనకోడలు.. ఇప్పుడు మెగాస్టార్ గర్వించే ఉద్యోగంలో ఉందిగా?
సినిమా రంగానికి దూరమైనప్పటికీ ఇతర రంగాల్లో మాత్రం ఇంకా మంచి పొజిషన్లో కొనసాగుతూ ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి ఒక చైల్డ్ ఆర్టిస్టు గురించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన జై చిరంజీవ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇక ఈ మూవీలో చిరంజీవి మేనకోడలి పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది. ఇక ఈ పాత్ర చుట్టే సినిమా మొత్తం తిరుగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కాగా చిరంజీవి మేనకోడలిగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ శ్రీయ శర్మ ఇక తన నటనతో కూడా ఆకట్టుకుంది. ఇక ఈ మూవీ తర్వాత వరుసగా అవకాశాలు కూడా అందుకుంది.
తెలుగులోనే కాదు తమిళ కన్నడ హిందీ భాషల్లోనూ ఎన్నో సినిమాల్లో నటించింది శ్రియ శర్మ. ఇక బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నేషనల్ దక్కించుకుంది. ఆ తర్వాత టీనేజ్ లో ఉన్నప్పుడు దూకుడులో సమంత చెల్లిగా.. రచ్చ, తూనీగా తూనీగా, ఎటో వెళ్లిపోయింది మనసు లాంటి సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించింది. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన నిర్మల కాన్వెంట్ లోను హీరోయిన్ గా ఆకట్టుకుంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఈమెకు 26 ఏళ్ళు. సినిమాలకు కాస్త దూరంగానే ఉంది. కానీ న్యాయవిద్యను పూర్తిచేసుకుని.. పెద్దపెద్ద కార్పోరేట్ సంస్థలకు అడ్వకేట్ గా పనిచేస్తుంది శ్రియ శర్మ. ఒక రకంగా చిరు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈమె.. ఇక ఇప్పుడు మెగాస్టార్ గర్వించే ఉద్యోగంలో కొనసాగుతుంది అని చెప్పాలి.