ఉస్తాది భగత్ సింగ్ సినిమాపై సంచలన కామెంట్స్ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..!?

Anilkumar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు ఎన్నికలు మరొకవైపు సినిమాలతో తీరిక లేకుండా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నికలు దగ్గరకు వస్తున్న కారణంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టాడు. ఇక ఎన్నికలు దగ్గరికి వస్తుండడంతో సినిమాలకు సైతం గ్యాప్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం పవన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి. పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వకపోవడంతో ఈ సినిమాను పక్కన పెట్టేశారు .అయితే దాదాగా ఊహించని విధంగా సడన్ గా నిన్న ఉస్తాద్ భగత్ సింగ్

 సినిమా నుండి ఒక గ్లిప్స్ వీడియోని విడుదల చేశారు మేకర్స్ . వీడియోలో పవన్ గాజు గ్లాస్ గురించి చెబుతూ.. గాజు పగిలేకొద్ది పదునెక్కుద్ది. గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం అనే డైలాగ్ వేస్తాడు. అయితే ఇది పొలిటికల్ కి ఉపయోగపడాలనే ఇపుడు ఈ గ్లింప్స్, ఆ గాజు డైలాగ్ తో రిలీజ్ చేసారని తెలుస్తోంది. ఈ డైలాగ్ పై పవన్ స్పందించారు. నిన్న రాత్రి జనసేన కార్యాలయంలో కార్యకర్తలతో మీటింగ్ జరగగా పవన్ ఈ మీటింగ్ లో ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మాట్లాడారు. ఈ సందర్బంగా పవన్ మాట్లాడుతూ.. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ఒక క్యారెక్టర్ గ్లాస్ పడేస్తారు.  

ఈ రోజు వచ్చింది అనుకుంట గ్లింప్స్. ఆ గ్లాస్ పడి ముక్కలు అయిపోద్ది. షూటింగ్ జరిగేటప్పుడు ఆ డైలాగ్ ఎందుకు రాసావ్ అని హరీష్ శంకర్ ని అడిగితే.. అందరూ మీరు ఓడిపోయారు, ఓడిపోయారు అంటే నేను ఒకటే చెప్పా గాజుకి ఉండే లక్షణం ఏంటంటే పగిలేకొద్దీ పదునెక్కుతుంది. మీకు తెలియదు మా లాంటి ఫ్యాన్స్ ఇలాంటివి కోరుకుంటారు అని అన్నాడు. నాకు ఇలాంటివి చెప్పడం ఇష్టం ఉండదు. కానీ హరీష్ శంకర్ బాధ భరించలేక ఆ డైలాగ్ చెప్పాను అని అన్నారు. అలా ప్రస్తుతం ఈ సినిమాపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: