ఆ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న గామి చిత్ర బృందం..!?

Anilkumar
టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్సేన్ హీరోగా నటించిన గామి సినిమా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విద్యాధర కాగితా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా శివరాత్రి సందర్భంగా మార్చ్ 8న విడుదలై థియేటర్స్లోకి వచ్చింది. అయితే విడుదలకి ముందే ఈ సినిమా మంచి వచ్చేలా చేశారు చిత్ర బృందం. ఇక విడుదలైన తరువాత అంచనాలకు మించిన విజయాన్ని అందుకుంది.  కలెక్షన్ల విషయంలో కూడా అంచనాలకు మించి కలెక్ట్ చేసింది ఈ సినిమా.  మొదటి రోజు నుండే బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంది.  అంతేకాదు విడుదలైన రెండు

 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పాయింట్ ను కూడా చేరుకుంది. అంతేకాదు ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే మంచి విషయాలు అద్భుతమైన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఉండడంతో ఈ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చింది.  అంతేకాదు తన కెరియర్ లో ఇప్పటి వరకు ఎటువంటి సినిమా చేయలేదు విశ్వక్ అంతలా ఈ సినిమాలో అదరగొట్టేసాడు. ఇక సినిమా హిట్ అయిన తర్వాత చిత్ర బృందం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.  ఇప్పటికే కొన్ని క్రౌడ్ ఫండింగ్ సినిమాలు తెరకెక్కి మంచి హిట్లుగా మారాయి కానీ సినిమా హిట్ అయ్యాక వారికి వచ్చిన పెట్టుబడులను తిరిగి

ఇవ్వడం ఇప్పటిదాకా ఇండస్ట్రీలో జరగలేదని చెప్పుకోవచ్చు. కానీ గామి మూవీ యూనిట్ మాత్రం ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. క్రౌడ్ ఫండింగ్ లో పాల్గొన్న వారిని గౌరవించి వారు సినిమాకి అందించిన పెట్టుబడులు వారికి తిరిగి ఇచ్చేయాలని చిత్ర బృందం నిర్ణయించుకుంది. "మేము మా మైలురాయిని చేరుకున్నాము. అందుకే మీరు సినిమాపై పెట్టిన పెట్టు బడిని తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నాము" అని గామి యూనిట్ ఇప్పటికే ఇన్వెస్టర్లకు మెయిల్ చేసింది. ఇప్పటికే డబ్బులు ఇచ్చిన వాళ్ళందరి పేర్ల జాబితాను చిత్ర టీమ్ సిద్ధం చేసుకుంది. వారు ఇచ్చిన పెట్టుబడులతో పాటు లాభాలు కూడా వారితోనే పంచుకోనుంది. ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: