సందీప్.. త్రినాధరావు కాంబో మూవీపై వస్తున్న వార్తలు అన్ని అవాస్తవం... రాజేష్ దండ..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాత గా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో రాజేష్ దండ ఒకరు. ఈయన ఇప్పటికే పలు సినిమాలను నిర్మించి అందులో కొన్ని మూవీ లతో మంచి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాత గా తనకంటూ ఒక మంచి స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈ నిర్మాత టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటు వంటి సందీప్ కిషన్ హీరో గా అలాగే తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడి గా మంచి గుర్తింపును సంపాదించుకున్న త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో ఓ మూవీ ని రూపొందిస్తున్నాడు.

కొన్ని రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇకపోతే ఈ సినిమా యొక్క అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఈ సినిమా మలయాళం లో సూపర్ హిట్ విజయం సాధించినటు వంటి బ్రో డాడీ అనే మూవీ కి రీమేక్ అని అనేక వార్తలు బయటికి వచ్చాయి. ఇకపోతే తాజాగా ఈ సినిమా నిర్మాత అయినటువంటి రాజేష్ దండ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా ఈయన ఈ వార్తలకు సంబంధించి ఫుల్ క్లారిటీ ఇచ్చాడు.

తాజా ఇంటర్వ్యూ లో రాజేష్ దండా మాట్లాడుతూ ... సందీప్ కిషన్ హీరో గా త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా బ్రో డాడి మూవీ కి రీమేక్ అని వార్తలు వస్తున్నాయి. అవి అన్ని అవాస్తవం. ఇది కొత్త సబ్జెక్టు తో రూపొందుతున్న సినిమా. ఇకపోతే మొదట ఈ సినిమా కథను చిరంజీవి గారికి నరేట్ చేసాం. మళ్ళీ అదే కథను అనేక మార్పులు ... చేర్పులు చేసి సందీప్ కిషన్ హీరో.గా తెరకెక్కిస్తున్నాం అని ఈ నిర్మాత తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: