"ఈ రోజుల్లో" రీ రిలీజ్ హక్కులు వారికే..?

Pulgam Srinivas
శ్రీనివాస్ , రేష్మ రాథోర్ హీరో , హీరోయిన్ లుగా మారుతీ దర్శకత్వంలో "ఈ రోజుల్లో" అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా చాలా సంవత్సరాల క్రితం థియేటర్ లలో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకొని సూపర్ సాలిడ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఇకపోతే ఈ సినిమా తోనే మారుతి దర్శకుడి గా తన కెరియర్ మొదలు పెట్టాడు. ఇలా దర్శకుడి గా కెరియర్ ప్రారంభించిన మొదటి సినిమా తోనే ఈయన మంచి విజయం అందుకోవడంతో ఈయన కు ఈ సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు లభించింది.
 

ఇకపోతే ఆ సమయం లో అద్భుతమైన విజయం అందుకున్న ఈ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ ని ఈ నెల 23 వ తేదీన థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క రీ రిలీస్ హక్కులను ఏ ఏరియాలో ఎవరు దక్కించుకున్నారు అనే విషయాలను తెలియజేస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.

ఆ పోస్టర్ ప్రకారం ఈ సినిమా యొక్క వైజాగ్ మరియు నైజాం ఏరియా థియేటర్ హక్కులను ఎస్విసి సినిమాస్ సంస్థ వారు దక్కించుకోగా ... కృష్ణ మరియు వెస్ట్ గోదావరి థియేటర్ హక్కులను జి ఎఫ్ డి మరియు గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ వారు దక్కించుకున్నారు. ఇక ఈస్ట్ గోదావరి హక్కులను వింటేజ్ క్రియేషన్స్ సంస్థ వారు దక్కించుకోగా ... గుంటూరు , నెల్లూరు మరియు సిడెడ్ హక్కులను యు వి మూవీస్ వారు దక్కించుకున్నారు. మరి ఈ సినిమా రీ రిలీస్ లో భాగంగా ఏ స్థాయి కలెక్షన్ లను సాధిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: