50సెకన్ల యాడ్ కు షాకింగ్ పారితోషకం తీసుకున్న లేడీ సూపర్ స్టార్ నయనతార..!!

murali krishna
బాలీవుడ్ అయినా, కోలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా ఎక్కడికి వెళ్లినా ఆమెకు ఉండే క్రేజే వేరు. సినిమా ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా పేరుపొందిన నయనతార హీరోలతో పోటీపడి రెమ్యునరేషన్ లో ముందు వరుసలో నిలుస్తుంది. ఒకపక్క సినిమాలతో పాటు మరోపక్క తన సొంత బిజినెస్ ను బ్రహ్మాండంగా నడిపిస్తున్న స్టార్ హీరోయిన్ నయనతార ఏం చేసినా సెలక్టివ్ గా చేస్తారు.భారీ అవకాశాలు వచ్చినప్పుడు వాటిని వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకున్న ఈ సెలబ్రిటీ తాజాగా ఒక యాడ్లో 50 సెకండ్ల పాటు నటించి భారీ పారితోషకాన్ని అందుకున్నారనీ ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది. కేవలం 50 సెకండ్ల నిడవి కలిగిన ఒక యాడ్లో నటించినందుకు నయనతార తీసుకున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు ప్రతి ఒక్కరి కళ్ళు బైర్లు కమ్మేలా చేస్తుంది.లేడీ సూపర్ స్టార్ నయనతార పెద్దగా అడ్వర్టైజ్మెంట్లలో నటించదు. ఆమె చాలా తక్కువ శాతం యాడ్స్ కు ప్రయారిటీ ఇస్తారు. ఏదైనా ప్రఖ్యాతిగాంచిన సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తేనే నయనతార వారికి సంబంధించిన యాడ్స్ చేస్తారు. ఇక సినిమా ఇండస్ట్రీలో ఫుల్ డిమాండ్ ఉన్న నయనతార ఒక యాడ్ చేయాలంటే ఎంత డిమాండ్ చేస్తారు అన్నది ప్రతి ఒక్కరికి ఆసక్తి కలిగించే అంశం.ఓ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన నయనతార ఆ యాడ్ కు సంబంధించి భారీగానే వసూలు చేసింది అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. నయనతార తాజాగా టాటా స్కై ప్రమోషనల్ యాడ్ లో నటించినట్టు తెలుస్తుంది. కేవలం 50 సెకండ్ల నిడివి కలిగిన ఈ యాడ్ కోసం నయనతార ఏకంగా ఐదు కోట్లు తీసుకున్నట్టు తెలుస్తుంది.ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో హల్చల్ చేస్తుండగా స్టార్ హీరోలు కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ కు ఇంత పెద్ద మొత్తంలో పారితోషకం తీసుకొని ఉండరు అని పలువురు కామెంట్ చేస్తున్నారు. అయితే సౌత్ ఇండియాలో ఫేమస్ హీరోయిన్, ఇటీవల బాలీవుడ్ లోనూ ఆఫర్లతో బిజీగా ఉన్న హీరోయిన్ నయనతార డిమాండ్ పై ప్రధానంగా ఇండస్ట్రీ వర్గాలలో చర్చ జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: