త్వరలోనే ఆ స్టార్ కపుల్ విడిపోబోతున్నారు.. వేణు స్వామి షాకింగ్ కామెంట్స్..!?

Anilkumar
ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇక ఈయన కొత్తగా పెళ్లయిన సినీ సెలబ్రిటీల విషయాల్లో ఆయన చెప్పే విషయాలు ఫలించడం తో ఆయన సోషల్ మీడియాలో తరచూ ఏదో ఒక వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటాడు.  సినీ ఇండస్ట్రీలో ఉన్నవారు చాలామంది ఆయన జ్యోతిష్యం నమ్మి ఆయన దగ్గరికి వెళుతూ ఉంటారు. గతంలో అక్కినేని నాగచైతన్య సమంత ఇద్దరూ విడిపోతారు అని అఖిల్ కి పెళ్లి అవ్వదు అని కెరియర్ లో ఏవో గండాలు ఉన్నాయి అని వేడు స్వామి చెప్పాడు. ఆయన చెప్పింది చెప్పినట్లుగానే ప్రస్తుతం

 ఇదే పరిస్థితి మనం చూడొచ్చు.. ఈ మధ్య కాలంలో యూత్ లో కొత్త మార్పు వచ్చింది . ఇప్పుడు ఓ ప్రముఖ స్టార్ కపుల్‌పై అతడు చేసిన కామెంట్ అంతర్జాలంలో వైరల్ గా మారింది. ఇంతకుముందు నాగచైతన్య- సమంత జంట విడిపోతారని ముందే చెప్పిన వేణు స్వామి.. ఇటీవల పెళ్లయిన ఒక సెలబ్రిటీ కపుల్ కొన్నాళ్ల తర్వాత విడిపోతారంటూ ఇప్పుడు జోశ్యం చెప్పారు. వరుడికి నాగదోషం ఉంది. వధువుకు గురు దోషం ఉంది. దీనివల్ల కలిసి ఎక్కువ కాలం కలిసి ఉండరు.. అంటూ వేణు స్వామి జోశ్యం చెప్పడంతో అది కాస్తా హాట్ టాపిక్ గా మారింది. సెలబ్రిటీ జంట

 విడిపోవడం ఖాయమని ఘంటాపథంగా చెబుతున్నాడు వేణు స్వామి. తమకు ఏమీ కాదని భావించడమే ప్రేమకు ఉన్న బలం. ప్రేమికులు గుడ్డిగా పెళ్లి చేసుకుంటారు.  ఆ తర్వాతే సమస్యలు ఏర్పడతాయి అని కూడా వ్యాఖ్యానించారు. ఆరేళ్ల ప్రేమాయణం తర్వాత పెద్దల్ని ఒప్పించి ఆ సెలబ్రిటీ కపుల్ పెళ్లాడారు కదా? ఇంతలోనే విడిపోతారని అంటారేమిటి? అంటూ సదరు యాంకర్ అడిగిన ఎదురు ప్రశ్నకు.. శాస్త్రం ఫలిస్తుందని వేణు స్వామి అన్నారు. నమ్మేవాళ్లకు మాత్రమే శాస్త్రం వంటపడుతుందని కూడా అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: