తాత అన్నానమ్మలతో కలిసి అయోధ్య బాల రాముడిని దర్శించుకున్న ఉపాసన..!

Anilkumar
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉపాసన తరచు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా ఉపాసన అయోధ్య బాల రాముడిని దర్శించుకున్నారు. తన భర్తతో కలిసి అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి వెళ్లిన ఉపాసన మళ్లీ ఇప్పుడు తన తాత నానమ్మలతో కలిసి రాముడు దగ్గరికి దర్శించుకున్నారు. దీంతో ప్రస్తుతం వాటి కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సందర్భంగా అపోలో హాస్పిటల్స్ ఫౌండర్ ప్రతాప్ సి రెడ్డి నానమ్మ ఇతర కుటుంబ

సభ్యులతో కలిసి  అక్కడ కొన్ని ప్రత్యేక పూజలను కూడా నిర్వహించడం జరిగింది. అయోధ్య రామ మందిరంలో గత 48 రోజులుగా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన రామరాగ్ సేవ ఈ నెల 10వ తేదీన ముగిసింది. ఈ రామరాగ్ సేవ ముగింపు సందర్భంగా ఉపాసన తన కుటుంబ సభ్యులతో కలిసి అయోధ్యకు వెళ్లింది. బాలరాముని సేవలో తరించింది. తాజాగా వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. 'నా కోరిక తీరింది, ఒక కల నెరవేరిందని.. ఇదొక అద్భుతమైన.. దివ్యమైన అనుభూతి. నా జీవితంలో మరిచిపోలేని ప్రయాణంలో ఇది ఒకటిగా

 నిలిచిపోతుంది. తెల్లవారుజూమున 4 గంటలకు స్వామివారిని దర్శించుకున్నాం' అని సోషల్ మీడియాలో పోస్టులో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఉపాసన షేర్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇందులో ఆలయ పరిసరాల్లో ఉపాసన, ఆమె తాత , అపోలో ప్రతాప్ సీ రెడ్డి, నాయనమ్మలను కూడా చూడొచ్చు. అంతకుముందు ఉత్తర ప్రదేశ్ ముఖ్య మంత్రి యోగి ఆదిత్య నాథ్ ను ప్రత్యేకంగా కలిసింది ఉపాసన. అయోధ్యలోనూ అపోలో ఆస్పత్రి సేవలను విస్తరించాలని కోరారు. ఇక్కడి భక్తులకు ఉచితంగా అత్యవసర సేవలను అందిస్తామంటూ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: