అల్లు అర్జున్ పుష్ప 2 లో బాలీవుడ్ స్టార్స్..!?

Anilkumar
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా పుష్ప టు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వైజాగ్ లో మూడు రోజులపాటు షూటింగ్ను శరవేగంగా జరుపుకున్న చిత్ర బృందం తాజాగా హైదరాబాద్ కు తిరిగు వచ్చింది. ప్రస్తుతం హైదరాబాదులో నెక్స్ట్ షెడ్యూల్ను ప్రారంభించింది. కాగా ఈ సినిమాలోని కొన్ని ముఖ్యమైన అదనపు సన్నివేశాలను పరిచయం చేయాలి అని దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్పటు సినిమా నుండి మరో

 వార్త లీక్ అయి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .అయితే ఈ సినిమాలో జాన్వి కపూర్ సమంత లతో పాటు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ సైతం అతిథి పాత్రలో సినిమాలో కనిపించబోతున్నారు అన్న వార్తలు వినబడుతున్నాయి. మొదటి భాగంలో చేసిన పాత్ర తరహాలోనే ఈ చివర్లో సమంత ఓ ఐటెం సాంగ్ లో కనిపించనుందని ప్రచారం జరుగుతోంది. ప్రముఖ నటుల ఈ అతిథి పాత్రలు “పుష్ప 2” స్థాయిని పెంచడానికి ఉద్దేశించినవి. నార్త్ ఇండియన్ మార్కెట్ లో ఈ మంచి విజయం సాధిస్తుందని, బ్లాక్ బస్టర్ అవుతుందని అల్లు అర్జున్ ధీమా

వ్యక్తం చేస్తున్నాడు. దీంతో ప్రమోషనల్ ఈవెంట్స్ ను గ్రాండ్ గా నిర్వహించేందుకు చిత్రబృందం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. పుష్ప ది రూల్’ విడుదల కోసం అల్లు అర్జున్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘పుష్ప 2’ ఆగస్టు 15న పలు భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ చిత్రానికి టోగ్రాఫర్ మిరోస్లావ్ కుబా బ్రోజెక్, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్, రూబెన్. ‘పుష్ప: ది రూల్’ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.  అయితే ఇటీవల రష్మిక మందన్న రాబోయే సీక్వెల్ భారీ బడ్జెట్ మూవీ, అంచనాలకు మించి ఉంటుందని ఆమె అన్నారు. తెలుగుతో పాటు జపాన్ లో కూడా విడుదల అవుతుందని ఆమె చెప్పారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: