ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన పృథ్విరాజ్..!!!
'నేను ప్రభాస్ మంచి ఫ్రెండ్స్. మేం ఇద్దరమూ ఎప్పుడూ ఒకరితో ఒకరం మాట్లాడుకుంటూ టచ్లో ఉంటాం. 'సలార్ 2' షూటింగ్ అతి త్వరలో మొదలుకానుంది' అని పృథ్వీరాజ్ వ్యాఖ్యానించారు. ఇక, 'సలార్'లో కీలక పాత్రలో యాక్ట్ చేసిన వెర్సటైల్ యాక్టర్ బాబీ సింహా కూడా పార్ట్-2 గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'సలార్ 2' స్టోరీ రెడీగా ఉందన్నారు. ఏప్రిల్లో ఫిల్మ్ షూటింగ్ స్టార్ట్ చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. వచ్చే ఏడాది రిలీజ్కు ప్లాన్ చేసినట్లు వివరించారు. అటు పృథ్వీరాజ్, ఇటు బాబీ సింహా మాటల్ని బట్టి 'సలార్' సీక్వెల్ వచ్చే నెలలో సెట్స్ మీదకు వెళ్లడం ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు. కాగా, పార్ట్-2ను 'శౌర్యాంగ పర్వం' పేరుతో తెరకెక్కించనున్నారు. ఫస్ట్ పార్ట్లో ప్రశ్నలుగా మిగిలిన వాటికి సీక్వెల్లో సమాధానాలు ఇవ్వనున్నాడు నీల్ మామ. ఇక, ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ'తో పాటు 'రాజా సాబ్'లో నటిస్తున్నారు. మరి.. 'సలార్ 2' కోసం మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ల రూపంలో డిసెంబర్ 22న విడుదలైన సలార్ టాలీవుడ్ బడా హిట్స్ లో ఒకటిగా ఉంది. కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ సలార్ చిత్రాన్ని తెరకెక్కించాడు. ప్రభాస్ ఇమేజ్ కి తగ్గట్లు భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దారు.ఈ క్రమంలో సలార్ 2 పై అంచనాలు ఏర్పడ్డాయి. శౌర్యంగ పర్వం పేరుతో రెండవ భాగంలో ప్రశాంత్ నీల్ అసలు కథ చెప్పనున్నాడు. సలార్ 2లోనే అసలు మేటర్ ఉందట. అందుకే సలార్ కథ అసంపూర్తిగా ఉంది. మరి సలార్ 2 ఎప్పుడు వస్తుందనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది. కీలక రోల్ చేసిన పృథ్విరాజ్ సుకుమారన్ అప్డేట్ ఇచ్చాడు. తన లేటెస్ట్ మూవీ ది గోట్ లైఫ్ ప్రొమోషన్స్ లో పాల్గొన్నారు.