ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన పృథ్విరాజ్..!!!

murali krishna
వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కరి అవుతున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్కు గొప్ప ఊరటను ఇచ్చింది 'సలార్'. 'బాహుబలి 2' తర్వాత ఆ రేంజ్ సక్సెస్ లేక చాన్నాళ్లు ఇబ్బంది పడ్డారు డార్లింగ్. 'సాహో' నుంచి 'ఆదిపురుష్' వరకు ప్రతి చిత్రం ఆకాశామంత అంచనాలతో విడుదల అవడం, బాక్సాఫీస్ దగ్గర చతికిలపడటం తెలిసిందే. అయితే అవి ఫెయిలైనా ప్రభాస్ స్టామినా వల్ల వసూళ్లలో ఫర్వాలేదనిపించాయి. దీంతో ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలని చూస్తున్న ఆయనకు 'సలార్' రూపంలో బిగ్ రిలీఫ్ దొరికింది. కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీ గతేడాది రిలీజై భారీ బ్లాక్బస్టర్గా నిలిచింది. ప్రభాస్ను అభిమానులు చూడాలనుకునే విధంగా ఊరమాస్ అవతార్లో చూపించాడు నీల్ మామ. దీంతో సినిమాను సూపర్హిట్ చేశారు ఫ్యాన్స్, ఆడియెన్స్. ఫస్ట్ పార్ట్ గ్రాండ్ సక్సెస్ అవడంతో 'సలార్ 2' మీద ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెరిగిపోయాయి.ప్రభాస్ ఇతర సినిమాలతో ఫుల్ బిజీగా ఉండటంతో 'సలార్ 2'ఇప్పట్లో లేనట్లేనని అంతా అనుకుంటున్నారు. ఈ తరుణంలో సీక్వెల్ మీద క్రేజీ అప్డేట్ ఇచ్చారు పృథ్వీరాజ్ సుకుమారన్. 'సలార్'లో వరదరాజ మన్నార్ పాత్రలో తనదైన శైలిలో నటించి మంచి మార్కులు కొట్టేశారీ మలయాళ సూపర్స్టార్. ప్రభాస్ స్నేహితుడిగా వరద క్యారెక్టర్లో ఆయన ఒదిగిపోయిన తీరు, ఎక్స్ప్రెషన్స్ పలికించిన తీరుకు అంతా ఫిదా అయ్యారు. అలాంటి పృథ్వీరాజ్ తాజాగా 'సలార్' సీక్వెల్ గురించి అప్డేట్ ఇచ్చారు. త్వరలోనే సీక్వెట్ షూటింగ్ మొదలవుతుందంటూ అభిమానులకు గుడ్న్యూస్ చెప్పారు. తాను, ప్రభాస్ మంచి ఫ్రెండ్స్ అన్నారు. తామిద్దరం ఎప్పుడూ ఒకరితో ఒకరం మాట్లాడుకుంటూ టచ్లో ఉంటామని పృథ్వీరాజ్ తెలిపారు. 'సలార్' పార్ట్-2 షూటింగ్ అతి త్వరలో ప్రారంభం కానుందని చెప్పుకొచ్చారు.
'నేను ప్రభాస్ మంచి ఫ్రెండ్స్. మేం ఇద్దరమూ ఎప్పుడూ ఒకరితో ఒకరం మాట్లాడుకుంటూ టచ్లో ఉంటాం. 'సలార్ 2' షూటింగ్ అతి త్వరలో మొదలుకానుంది' అని పృథ్వీరాజ్ వ్యాఖ్యానించారు. ఇక, 'సలార్'లో కీలక పాత్రలో యాక్ట్ చేసిన వెర్సటైల్ యాక్టర్ బాబీ సింహా కూడా పార్ట్-2 గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'సలార్ 2' స్టోరీ రెడీగా ఉందన్నారు. ఏప్రిల్లో ఫిల్మ్ షూటింగ్ స్టార్ట్ చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. వచ్చే ఏడాది రిలీజ్కు ప్లాన్ చేసినట్లు వివరించారు. అటు పృథ్వీరాజ్, ఇటు బాబీ సింహా మాటల్ని బట్టి 'సలార్' సీక్వెల్ వచ్చే నెలలో సెట్స్ మీదకు వెళ్లడం ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు. కాగా, పార్ట్-2ను 'శౌర్యాంగ పర్వం' పేరుతో తెరకెక్కించనున్నారు. ఫస్ట్ పార్ట్లో ప్రశ్నలుగా మిగిలిన వాటికి సీక్వెల్లో సమాధానాలు ఇవ్వనున్నాడు నీల్ మామ. ఇక, ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ'తో పాటు 'రాజా సాబ్'లో నటిస్తున్నారు. మరి.. 'సలార్ 2' కోసం మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ల రూపంలో డిసెంబర్ 22న విడుదలైన సలార్ టాలీవుడ్ బడా హిట్స్ లో ఒకటిగా ఉంది. కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ సలార్ చిత్రాన్ని తెరకెక్కించాడు. ప్రభాస్ ఇమేజ్ కి తగ్గట్లు భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దారు.ఈ క్రమంలో సలార్ 2 పై అంచనాలు ఏర్పడ్డాయి. శౌర్యంగ పర్వం పేరుతో రెండవ భాగంలో ప్రశాంత్ నీల్ అసలు కథ చెప్పనున్నాడు. సలార్ 2లోనే అసలు మేటర్ ఉందట. అందుకే సలార్ కథ అసంపూర్తిగా ఉంది. మరి సలార్ 2 ఎప్పుడు వస్తుందనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది. కీలక రోల్ చేసిన పృథ్విరాజ్ సుకుమారన్ అప్డేట్ ఇచ్చాడు. తన లేటెస్ట్ మూవీ ది గోట్ లైఫ్ ప్రొమోషన్స్ లో పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: