పెళ్లి అయిన తర్వాత మొదటిసారి భర్తపై అలాంటి కామెంట్స్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్..!?

Anilkumar
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఎందుకంటే తాజాగా పెళ్లి చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్ కి సంబంధించిన రకరకాల విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ బ్యూటీ ఒకప్పుడు టాలీవుడ్ లో ఉన్న దాదాపుగా అందరూ స్టార్ హీరోల సరసన హీరోయిన్గా నటించింది. అలా కొంతకాలం తర్వాత తెలుగులో ఈ బ్యూటీ కి అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ కి మకాం మార్చింది. అక్కడ సినిమాలు చేయడం స్టార్ట్ చేసింది. కానీ ఊహించని విధంగా బాలీవుడ్ లో సక్సెస్ అందుకోలేకపోయింది రకుల్ ప్రీత్ సింగ్.

ఈ క్రమంలోనే బాలీవుడ్ నటుడు నిర్మాత జాకీ భగ్నానిని ప్రేమించి వివాహం చేసుకుంది రకుల్. కొద్ది రోజుల క్రితమే వీరిద్దరికీ ఘనంగా వివాహం కూడా అయ్యింది. ఈ క్రమంలోనే పెళ్లి తర్వాత మొదటి సారి తన భర్త పై కొన్ని షాకింగ్ కామెంట్లు చేసింది రకుల్ ప్రీత్ సింగ్. దీంతో ఆమె చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జాకీ భగ్నాన్ని గురించి మాట్లాడుతూ తనలో నచ్చే గుణగణాల గురించి అస్సాంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో వివరించింది. జాకీ లాంటి వ్యక్తి నాకు భర్తగా లభించడం నిజంగా నా అదృష్టం అంటూ చెప్పుకొచ్చిన ఆమె..

అతను ఎప్పుడు చాలా సరదాగా ఉంటాడు.. సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఎక్కువ.. అది నాకు బాగా నచ్చుతుంది. జాకీ ఎప్పుడు తను నవ్వుతూ చుట్టూ ఉన్న వారిని కూడా నవ్విస్తూ ఉంటాడు. అదే అతనిలో స్పెషల్ అంటూ వివరించింది. అదే జాకీని నేను ఇష్టపడేలా చేసింది అంటూ చెప్పుకొచ్చింది. మంచి మనసున్న వ్యక్తి జాకీ అంటూ చెప్పుకొచ్చింది.  ఇక కెరీర్ గురించి మా నాన్న ఇప్పటివరకు మమ్మల్ని అన్ని విషయాల్లోనూ ప్రోత్సహించారు. నేను సినిమాల్లో నటించగలనని నన్ను అమ్మ ఎంకరేజ్ చేసింది. వారి వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా అంటూ ఆమె వివరించింది. టేబుల్ టెన్నిస్, గల్ఫ్‌, స్విమ్మింగ్ నాకు వాళ్ళు నేర్పించారని.. కష్టపడితే ఎవరైనా సక్సెస్ అవుతారని నన్ను ప్రోత్సహించే వారంటూ వివరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: