"ఓటిటి" లో దూసుకుపోతున్న "అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్"..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ నటుడు సుహాస్ తాజాగా అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి దుష్యంత్ కటికనేని దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకొని మంచి కలెక్షన్ లను వసూలు చేసిన ఈ సినిమా ఆ తర్వాత కొంత కాలానికే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ "ఓ టి టి" సంస్థలలో ఒకటి అయినటు వంటి ఆహా సంస్థ వారు దక్కించుకున్నారు. అందులో భాగంగా గత కొన్ని రోజులుగా ఈ సంస్థ వారు ఈ సినిమాని తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు.
 

ఇది ఇలా ఉంటే ఈ సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను కూడా అద్భుతమైన రీతిలో ఆకట్టుకుంటుంది. ఇకపోతే ఇప్పటి వరకు ఈ సినిమాకు ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో 100 మిలియన్ ప్లస్ స్ట్రీమింగ్ మినిట్స్ దక్కినట్లు ఆహా సంస్థ వారు తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరస్ అవుతుంది. ఇప్పటికే థియేటర్ ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ సినిమా ప్రస్తుతం "ఓ టి టి" ప్రేక్షకులను కూడా అదిరిపోయే రేంజ్ లో అలరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే సుహాస్ ప్రస్తుతం ప్రసన్న వదనం అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: