ఆదాశర్మ చుట్టూ వివాదాలు !

Seetha Sailaja
బాలీవుడ్ బ్యూటీ ఆదాశర్మ రెగ్యులర్ గ్లామర్ హీరోయిన్ గా రాణించలేకపోవడంతో తన ఉనికిని చాటుకోవడానికి వివాదాస్పద సినిమాలు చేస్తోంది. గత సంవత్సరం విడుదలైన ‘కేరళ స్టోరీస్’ మూవీతో ఆమె పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగి పోయింది. కేరళలో జరిగిన ఒక  యదార్థ సంఘటనను ఆధారంగా తీసుకుని తీయబడ్డ ఆమూవీ జాతీయస్థాయిలో ఘనవిజయం సాధించడమే కాకుండా ఆసినిమా అనేక వివాదాలకు చిరునామాగా మారింది.

ఇప్పుడు మళ్ళీ మరో వివాదాస్పద సినిమాలో ఆమె నటిస్తూ జాతీయ మీడియా దృష్టిని ఆమె ఆకర్షిస్తోంది. లేటెస్ట్ గా ఆమె నటిస్తున్న ‘బస్తర్ ది నక్సల్’ మూవీతో ఆమె ఈనెల 15న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఈమూవీ ట్రైలర్ వివాదాలకు చిరునామాగా మారింది. 14 ఏళ్ళ క్రితం ఛత్తీస్ గడ్ లో మావోయిస్టులతో జరిగిన ఎన్ కౌంటర్ లో 75 సిఆర్పిఎఫ్ జవాన్లు మరణించడం అప్పట్లో దేశాన్ని కుడివేసింది.

ఈపాయింట్ ని తీసుకుని ‘బస్తర్’ మూవీని తీశారు. అనేకమంది పోలీసులు సీఆర్పీఎఫ్ జవానులతో పాటు అనేకమంది నక్సలైట్లు ఆ ఎన్ కౌంటర్ లో మరణించారు. ఈ వాస్తవ సంఘటనను ఆధారంగా తీసుకుని తీసిన ఈమూవీ కూడ కేరళ స్టోరీస్ లా ఘన విజయం సాధించే ఆస్కారం ఉంది. మరొక 10 రోజులలో విడుదలకాబోతున్న ఈ మూవీని ఏదోవిధంగా అడ్డుకోవాలని కొందరు కోర్టుకు వెళ్ళేప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి అభ్యంతరం వచ్చే అవకాశం ఉంది అన్నవార్తలు కూడ వస్తున్నాయి. ఈ మూవీట్రైలర్ లో ప్రభుత్వ వ్యవస్థ మీద రాజకీయ నాయకుల ద్వంద్వ వైఖరి మీద శత్రుదేశం చేసిన అరాచకాల మీద బలమైన కౌంటర్లు, ఎపిసోడ్లు ఉన్నట్టు కనిపిస్తూ ఉండటంతో ఈమూవీ కూడ వివాదాస్పద మూవీగా మారే ఆస్కారం ఉంది అంటున్నారు. అయితే కొందరు ‘ది కేరళ స్టోరీ’ లాగే ఇది కూడా ఒక ఉద్దేశ్యంతో తీశారని కేవలం వివాదాలు సృష్టించి ఘనవిజయం సాధించడమే ఈ మూవీ దర్శకుడు లక్ష్యం అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: