నితీష్ తివారి "రామాయణ" మూవీలో కీలక పాత్రలలో నటించబోయేది వీరే..?

Pulgam Srinivas
ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ లో భారీ అంచనాల నడుమ చిత్రీకరణకు రెడీ అవుతున్న సినిమాలలో రామాయణ మూవీ ప్రథమ స్థానంలో ఉంది అని చెప్పడంలో పెద్దగా వెనకాడాల్సి న పని లేదు . ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో అత్యంత ప్రజాధరణ పొందిన నటులతో నితీష్ తివారి రూపొందించ బోతున్నా డు . ఇక పోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ లో ఇండియా లోనే అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న నటి నటులు కీలక పాత్రల లో కనిపించ బోతున్నట్లు తెలుస్తోంది.  ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం నితీష్ తివారి దర్శకత్వంలో రూపొందే యే రామాయణ సినిమాలో ఎవరు ఏ పాత్ర లో నటించబోతున్నారు అనే విషయాలను తెలుసు కుందాం.
నితీష్ తివారి దర్శకత్వం లో రూపొంద బోయే రామాయణ సినిమాలో రాముని పాత్ర లో బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రన్బీర్ కపూర్ కనిపించబోతున్నాడు . ఇక సీత దేవి పాత్రలో సాయి పల్లవి కనిపించబోతుంది. కన్నడ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి యాష్ ఈ మూవీ లో రావణాసుర పాత్రలో కనిపించబోతున్నారు. సన్నీ డియోల్ ఈ మూవీ లో హనుమంతుడి పాత్రలో కనిపించబోతున్నాడు . ఈ మూవీ లో కుంభకర్ణ పాత్రలో బాబీ డియోల్ కనిపించనుండ గా ... లారా దత్త ఈ సినిమాలో కైకేయి పాత్రలో కనిపించనుంది. రకుల్ ప్రీత్ సింగ్ ఈ మూవీ లో సూర్పనఖ పాత్రలో కనిపించబోతున్న ట్లు తెలుస్తోంది. ఇలా ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన రేంజ్ గుర్తింపు కలిగిన ఈ నటీ నటులు ఈ సినిమాలో కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది . అలాగే ఈ సినిమాకి టెక్నికల్ టీం కూడా అద్భుతమైన క్రేజ్ ఉన్న వారు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: