ఆ విషయం లో టాలీవుడ్ దర్శకులపై షాకింగ్ కామెంట్స్ చేసిన మెగాస్టార్..!?

Anilkumar
భారీ అంచనాలతో విడుదల అయిన చిరంజీవి భోళా శంకర్.. ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.. దీంతో చిరంజీవి కొంత గ్యాప్‌ తీసుకుని తన తన తరువాత సినిమాల విషయం లో ఒక నిర్ణయం తీసుకుంటాడని సోషల్‌ మీడియా లో బాగా ప్రచారం జరిగింది. కొంత బ్రేక్ తీసుకొన్న తరవాతే తన తరువాత సినిమా ప్రకటన ఉంటుందని రూమర్స్ వచ్చాయి.అయితే ఎంతటి పరాజయం వచ్చిన చిరంజీవి మెగాస్టార్‌ తన ప్రణాళికల్లో ఎలాంటి మార్పు చేయలేదు ఇలాంటి జయాపజయాలు సహజమేనని చిరంజీవి భావించినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి- బింబిసార డైరెక్టర్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో రాబోతున్న చిత్రం విశ్వంభర.

సోషియో ఫాంటసీ మూవీగా రాబోతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ భారీగా తెరకెక్కిస్తోంది. సంక్రాంతి సందర్భంగా టైటిల్ ఎనౌన్స్ చేస్తూ విడుదల చేసిన చిన్న వీడియోకు గూస్ బంప్స్ వచ్చాయి. దీంతో.. ఈ మూవీపై ఎక్స్‌పెక్టేషన్స్‌ కూడా ఓ రేంజ్‌కి వెళ్లిపోయాయి. ఈ ప్రెస్టీజియస్‌ మూవీకి ప్రముఖ ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా.. చోటా కే నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ దర్శకుల పై ఇప్పటికే పలు సందర్భాల్లో సెటైర్లు వేశారు. తాజాగా మరోసారి టాలీవుడ్ దర్శకుల పై క్రేజీ కామెంట్స్ చేశారు మెగాస్టార్.

గతంలో ఆచార్య సమయంలోనూ దర్శకుల పై షాకింగ్ కామెంట్స్ చేశారు చిరంజీవి. మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వాలంటైన్. మానుషి చిల్లర్, రుహానీ శర్మ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ లో నవదీప్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మార్చి 1న ఆపరేషన్ వాలంటైన్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ ఇటీవలే గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తక్కువ బడ్జెట్ తో శక్తి ఇలాంటి చేయడం చాలా గ్రేట్ అన్నారు చిరు. శక్తి ని చూసి టాలీవుడ్ దర్శకులు నేర్చుకోవాలని అన్నారు. ఎక్కువ డబ్బు ఖర్చు పెడితేనే కు రిచ్‌నెస్‌ రాదు. తక్కువ బడ్జెట్‌లో కూడా ఇలా తీసి ఎలా రిచ్‌గా చూపించాలో తెలిసుండాలి.. అప్పుడే నిర్మాత బాగుంటారు.  అంటూ పేర్కొన్నారు..!?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: