'భీమా'.. యాక్షన్ విత్ మిస్టరీ

Anilkumar
యాక్షన్ హీరో గోపీచంద్ నటిస్తున్న తాజా చిత్రం 'భీమా'. పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాకి కన్నడ దర్శకుడు ఏ. హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియా భవాని శంకర్, మాళవికా శర్మ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో గోపీచంద్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. లాంగ్ గ్యాప్ తర్వాత గోపీచంద్ మళ్లీ ఖాకీ డ్రెస్ లో కనిపించబోతుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మ‌హా శివ‌రాత్రి కానుక‌గా మార్చి 8న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఇక విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ప్ర‌మోష‌న్స్ వేగవంతం చేసిన మూవీ టీమ్ సినిమా నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా 'భీమా' ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు. ఫిబ్రవరి 24 సాయంత్రం 4 గంటలకు ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నట్లు సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఈ పోస్టర్ కాస్త సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ఈసారి యాక్షన్ తో పాటు అడ్వెంచర్స్ కూడా ఉండబోతుందని పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. లేటెస్ట్ పోస్టర్లో గోపీచంద్ షాడో కనిపిస్తుండిగా.. అతని వెనకాలే ఓ టెంపుల్ ఉంది. దీన్ని బట్టి చూస్తే యాక్షన్ తో పాటు కొంత మిస్టరీని కూడా సినిమాలో జత చేసినట్లు అనిపిస్తుంది.

సినిమాలో టెంపుల్ సీక్వెన్స్ లు కూడా ఉన్నాయని పోస్టర్స్, టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. సరిగ్గా ఇలాంటి ఒక కాన్సెప్ట్ తో యాక్షన్ అడ్వెంచర్స్ గా గతంలో వచ్చిన 'సాహసం' గోపిచంద్ కి మంచి సక్సెస్ అందించింది. మళ్ళీ ఇన్నాళ్లకు భీమా సినిమాలో ఆ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఇక ట్రైలర్ పైనే అసలుబజ్ ఆధారపడి ఉంది. ట్రైలర్ కనుక ఇంప్రెస్సివ్ గా ఉంటే కచ్చితంగా గోపీచంద్ కి మంచి కం బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. గోపిచంద్ కొంతకాలంగా బాక్సాఫీస్ వద్ద వరుస అపజయాలను అందుకుంటున్నాడు. మరి ఈసారైనా 'భీమా' తో బౌన్స్ బ్యాక్ అవుతాడో లేదో చూడాలి. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బానర్పై కేకే రాధామోహన్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా.. రవి బస్సుర్ సంగీతం అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: