"టిల్లు స్క్వేర్" రన్ టైమ్ లాక్..?

Pulgam Srinivas
టాలీవుడ్ యువ నటుడు సిద్ధూ జొన్నలగడ్డ ప్రస్తుతం టిల్లు స్క్వేర్ అనే యూత్ ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాలో సిద్దు సరసన మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటిమని అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా ... మల్లిక్ రామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మించాడు. ఇకపోతే ఈ సినిమాని మార్చి 29 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

ఇప్పటికే ఎందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువబడింది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లను ఫుల్ జోష్ లో నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను ఈ మూవీ మేకర్స్ విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే ఇప్పటికే ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన రన్ టైమ్ ను కూడా లాక్ చేస్తున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ బృందం వారు ఈ సినిమాను 2 గంటల 1 నిమిషం నిడివి తో లాక్ చేసినట్లు ... ఇదే రన్ టైమ్ తో ఈ సినిమా థియేటర్ లలో విడుదల కాబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే సూపర్ సక్సెస్ అయినటువంటి డిజె టిల్లు మూవీ కి టిల్లు స్క్వేర్ మూవీ కొనసాగింపుగా రూపొందుతూ ఉండడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను ఏ స్థాయిలో అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: