రెండో బిడ్డ విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్న ఉపాసన..!?

Anilkumar
 గ్లోబల్ స్టార్  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఉపాసన లకి పెళ్లయిన 11 సంవత్సరాల తర్వాత ఇటీవల జూన్ 20న పాప జన్మించడం తెలిసిందే. దీంతో మెగా కుటుంబంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. పాప గర్భంలో ఉన్నప్పుడే తమ కుటుంబంలో ఎన్నో శుభకార్యాలు జరిగాయని చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదిగాడని ఆ పిల్ల ప్రభావం కారణమని చిరంజీవి మీడియా సమక్షంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే సమయంలో  గ్లోబల్ స్టార్  రామ్ చరణ్ కూతురు మహాజాతకురాలు.. అంటూ చాలామంది ప్రముఖ జ్యోతిష్యులు ఆమె పుట్టిన గడియలు బట్టి జ్యోతిష్యం వ్యవహరిస్తున్నారు. 

చిరంజీవిని మించిపోతుందని.. సాక్షాత్తు శ్రీరాముడి జాతకం లాంటిదని వివరించడం జరిగింది. అయితే ఒక దశలో  గ్లోబల్ స్టార్  మెగా పవర్ స్టార్   రామ్ చరణ్-ఉపాసనలకు పిల్లలు పుట్టరంటూ పలు పుకార్లు, ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఏదైనా సమస్య ఉందా? అని ఉపాసనను సన్నిహితులు అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయట. పిల్లల్ని కనడం ఒక బాధ్యత. అందుకు పూర్తిగా సన్నద్ధం అయ్యాకే పేరెంట్స్ కావాలని కోరుకున్నట్లు ఉపాసన ఓ సందర్భంలో చెప్పారు. ఇన్నేళ్లకు ఓ బిడ్డను కన్న ఉపాసన... రెండో బిడ్డను ఎప్పుడు కంటుందనే సందేహాలు ఉన్నాయి. 

దీనిపై ఆమె స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఆమె ఒకింత గుడ్ న్యూస్ చెప్పింది. సెకండ్ చైల్డ్ ని వెంటనే ప్లాన్ చేస్తున్నాం అన్నారు. అందుకు ఆమె సంసిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఉపాసన మాట్లాడుతూ... నేను ఆలస్యంగా పిల్లల్ని కనాలి అనుకున్నాను. అందుకే పదేళ్ల తర్వాత క్లిన్ కారను కన్నాను. ఈ విషయంలో ఎవరెంత ఒత్తిడి పెట్టినా భరించాను. ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు నాకు బాధ లేదు. అది పూర్తిగా నా ఇష్టం. అయితే సెకండ్ చైల్డ్ ని కనేందుకు సిద్ధంగా ఉన్నాను... అన్నారు. దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: