"దేవర" మూవీ నైజాం హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..?

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆయనకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే కొంత కాలం క్రితం వరకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగించిన ఈయన ఆఖరుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన "ఆర్ ఆర్ ఆర్" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన విజయం సాధించడంతో ఒక్క సారిగా ఎన్టీఆర్ కి గ్లోబల్ వైడ్ గా క్రేజ్ లభించింది. దానితో ప్రస్తుతం ఎన్టీఆర్ కూడా భారీ క్రేజ్ ఉన్న సినిమాలలో ... అత్యంత భారీ బడ్జెట్ మూవీ లలో నటిస్తూ వస్తున్నాడు.

ఇక అందులో భాగంగా ప్రస్తుతం ఎన్టీఆర్ , కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమాను మొత్తంగా రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదలకు ఇంకా చాలా రోజులు మిగిలి ఉండగానే ఈ మూవీ యొక్క థియేటర్ హక్కుల కోసం చాలా మంది డిస్ట్రిబ్యూటర్ లు పోటీపడుతున్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా ఈ మూవీ యొక్క నైజాం ఏరియా థియేటర్ హక్కులను భారీ ధరకు మైత్రి సంస్థ వారు ఇప్పటికే దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ సంస్థ వారు ఈ సినిమాను నైజాం ఏరియాలో అత్యంత భారీ ఎత్తున విడుదల చేయడానికి ఇప్పటి నుండే సన్నాహాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: