రీ రిలీజ్ కు రడీగా ఉన్న మహేష్.. చరణ్.. రవితేజ మూవీలు ఇవే..!

Pulgam Srinivas
ఈ మధ్య కాలంలో అనేక సినిమాలు రీ రిలీస్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అలాగే రీ రిలీజ్ అవుతున్న సినిమాలలో కొన్ని సినిమాలకు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభిస్తూ ఉండడంతో మరి కొంత మంది ఫిలిం మేకర్స్ కూడా తమ సినిమాలను రి రియల్ చేయడానికి ఉత్సాహ పడుతున్నారు. అందులో భాగంగా మరికొన్ని రోజుల్లో టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగినటువంటి మహేష్ బాబు , రామ్ చరణ్ , రవితేజ లకు సంబంధించిన కొన్ని సినిమాలు కూడా రీ రిలీజ్ కాబోతున్నాయి. ఆ సినిమాలు ఏవో తెలుసుకుందాం.
మహేష్ బాబు కొంత కాలం క్రితం భరత్ అనే నేను సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో కీయరా అద్వానీ హీరోయిన్ గా నటించగా ... కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఆ టైమ్ లో అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ సినిమాని మరికొన్ని రోజుల్లో రీ రిలీజ్ చేసేందుకు గాను ఈ మూవీ బృందం సన్నాహాలను మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొంత కాలం క్రితం ఎవడు అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో అల్లు అర్జున్ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ సినిమాని మరికొన్ని రోజుల్లో రీ రిలీస్ చేయబోతున్నట్లు సమాచారం.
మాస్ మహారాజా రవితేజ హీరో గా నయన తార హీరోయిన్ గా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన దుబాయ్ శీను సినిమా ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుందో మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఆ సమయంలో సూపర్ సక్సెస్ ను అందుకున్న ఈ సినిమాని మరికొన్ని రోజుల్లో రీ రిలీజ్ చేసేందుకు గాను చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: