రీ రిలీజ్ కు రడీగా ఉన్న మహేష్.. చరణ్.. రవితేజ మూవీలు ఇవే..!
మహేష్ బాబు కొంత కాలం క్రితం భరత్ అనే నేను సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో కీయరా అద్వానీ హీరోయిన్ గా నటించగా ... కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఆ టైమ్ లో అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ సినిమాని మరికొన్ని రోజుల్లో రీ రిలీజ్ చేసేందుకు గాను ఈ మూవీ బృందం సన్నాహాలను మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొంత కాలం క్రితం ఎవడు అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో అల్లు అర్జున్ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ సినిమాని మరికొన్ని రోజుల్లో రీ రిలీస్ చేయబోతున్నట్లు సమాచారం.
మాస్ మహారాజా రవితేజ హీరో గా నయన తార హీరోయిన్ గా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన దుబాయ్ శీను సినిమా ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుందో మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఆ సమయంలో సూపర్ సక్సెస్ ను అందుకున్న ఈ సినిమాని మరికొన్ని రోజుల్లో రీ రిలీజ్ చేసేందుకు గాను చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.