ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్య మంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన సినిమా యాత్ర. దర్శకుడు మహివి రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదల అయినప్పుడు చాలా మంచి విజయాన్ని అందుకుంది.యాత్ర సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికి సరిగ్గా 5 ఏళ్లు అవుతుంది. యాత్ర సినిమా 2019 ఫిబ్రవరి 8న విడుదల చేశారు. ఇక ఇప్పుడు యాత్ర 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫిబ్రవరి 8న యాత్ర 2 సినిమా రిలీజ్ అయ్యింది. యాత్ర 2 సినిమాలో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన కొని సంఘటనలో ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు దర్శకుడు మహివీ రాఘవ్. ఈ మూవీకి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. చూసిన వారందరూ కూడా మహివీ రాఘవ్ ఈ మూవీని తెరకెక్కించిన విధానాన్ని మెచ్చుకుంటున్నారు.
ఇక ఈ మూవీకి మంచి ఓపినింగ్స్ అయితే వచ్చాయి కానీ యాత్ర మూవీకి వచ్చినంత రాలేదు.దానికి కారణం వైసీపీ పై ఉన్న నెగటివిటీ. మొదటి షో తోనే యాత్ర 2 కు పర్వాలేదు అనే హిట్ టాక్ అయితే వచ్చింది. నైజాం 0.20 కోట్లు, సీడెడ్ 0.30 కోట్లు, ఆంధ్ర(టోటల్) 0.15 కోట్లు, ఏపీ, తెలంగాణ కలిపి 0.65 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 0.15 కోట్లు, ఓవర్సీస్ 0.18 కోట్లు, వరల్డ్ వైడ్ టోటల్ 0.98 కోట్లు వసూల్ చేసింది యాత్ర 2 సినిమా.యాత్ర 2 సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దాదాపు 2.20 కోట్ల బిజినెస్ చేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 6 నుండి 8 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక మొదటి రోజు ఈ రూ.0.98 కోట్ల షేర్ ను రాబట్టింది. అలాగే యాత్ర 2 సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకో రూ.7.02 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.