ఆ ఇద్దరు తమిళ దర్శకులను లైన్ లో పెట్టిన అల్లు అర్జున్..!

Pulgam Srinivas
పుష్ప పార్ట్ 1 మూవీ తో అల్లు అర్జున్ క్రేజ్ ఇండియా వ్యాప్తంగా పెరిగి పోయింది. ప్రస్తుతం అల్లు అర్జున్ "పుష్ప పార్ట్ 2" మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇకపోతే భారీ అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమాను ఈ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల కాకముందే అల్లు అర్జున్ అనేక క్రేజీ ప్రాజెక్టుబ్లను సెట్ చేసుకుంటూ వెళ్తున్నాడు.

అందులో భాగంగా ఇద్దరు తమిళ దర్శకులతో కూడా అల్లు అర్జున్ సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇక అసలు విషయం లోకి వెళితే ... గత కొన్ని రోజులుగా తమిళ సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా చేయబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే అట్లీ ... అల్లు అర్జున్ కి ఓ కథ నీ కూడా వినిపించినట్లు అది అల్లు అర్జున్ కి బాగా నచ్చినట్లు దానితో అట్లీ ప్రస్తుతం అల్లు అర్జున్ సూచించిన కథ పై పని చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక అట్లీ మాత్రమే కాకుండా తాజాగా జైలర్ మూవీ తో సూపర్ సక్సెస్ ను అందుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ కూడా అల్లు అర్జున్ కు కొన్ని రోజుల క్రితం ఆ కొత్త ను వినిపించగా ఈ దర్శకుడు చెప్పిన కథ కూడా అల్లు అర్జున్ బాగా నచ్చిందట. కానీ కొన్ని మార్పులు ... చేర్పులు సూచించడంతో ప్రస్తుతం ఈయన కూడా అల్లు అర్జున్ సూచించిన కథపై పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ అన్ని కుదిరినట్లు అయితే త్వరలోనే ఈ ఇద్దరు తమిళ దర్శకులతో అల్లు అర్జున్ మూవీ చేసే అవకాశాలు ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: