"పుష్ప" కి మూడో భాగం కూడా ఉండనుందా... అది ఎప్పుడో తెలుసా..?

Pulgam Srinivas
టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి అల్లు అర్జున్ ఆఖరుగా పుష్ప పార్ట్ 1 మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి సుకుమార్ దర్శకత్వం వహించగా ... నేషనల్ క్రష్ రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. మలయాళ నటుడు ఫాహధ్ ఫజిల్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించగా ... సునీల్ , అనసూయ , రావు రమేష్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలల్ నటించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించగా ... మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి సమంత ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటించింది. కొంత కాలం క్రితం విడుదల అయిన ఈ సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ లోని నటనకు గాను అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు కూడా దక్కింది.

ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ యొక్క రెండవ భాగం షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఈ సినిమా యొక్క రెండవ భాగాన్ని ఈ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళ్తే పుష్ప సినిమా పార్ట్ 2 తోనే ముగియ బోతుంది అని మొదట్లో వార్తలు వచ్చాయి. కానీ ఈ సినిమాకి పార్ట్ 3 కూడా ఉండబోతుంది అని కాకపోతే పార్ట్ 2 అయిపోయిన తర్వాత అల్లు అర్జున్ , సుకుమార్ తమ తమ తమ కమిట్మెంట్ లను పూర్తి చేసుకుని మళ్లీ పుష్ప పార్ట్ 3 మూవీ షూటింగ్ ను మొదలు పెట్టి ఆ తర్వాత ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: