'విశ్వంభర' లో హీరోయిన్ గా త్రిష

Anilkumar
బింబిసార' మూవీ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'విశ్వంభర'. సోషియో ఫాంటసీ జోనర్ లో రూపొందనున్న ఈ సినిమా ఇటీవల ఓ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక తాజాగా హైదరాబాద్ లో మరో షెడ్యూల్ మొదలైంది ఈ షెడ్యూల్ లో మెగాస్టార్ ఇటీవలే అడుగు పెట్టారు. ఇక ఇప్పుడు విశ్వంభర సెట్స్ లో హీరోయిన్ కూడా ఎంట్రీ చేసింది.'విశ్వంభర' మూవీలో మెగాస్టార్ సరసన ఎవరు నటిస్తున్నారనే సస్పెన్స్ కి తెరపడింది. ఇన్ని రోజులుగా చాలామంది హీరోయిన్స్ పేర్లు వినిపించాయి. కానీ ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా చెన్నై బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఇదే విషయాన్ని మూవీ టీం అధికారికంగా ప్రకటించారు. 

విశ్వంభర సెట్స్ కి త్రిషను ఆహ్వానిస్తున్నట్లు మూవీ టీం తెలియజేసింది. సెట్స్ లో త్రిష అడుగుపెట్టిన ఓ వీడియోని చిరంజీవి స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ గా మారింది.మెగాస్టార్ చిరంజీవితో త్రిష 'స్టాలిన్' అనే సినిమాలో నటించింది. 2006లో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంది. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవి, త్రిష ల జోడి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత మళ్లీ ఆచార్యలో త్రిషని హీరోయిన్ గా అనుకున్నారు. షూటింగ్ కి కొద్ది రోజుల ముందు క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆమె హీరోయిన్ గా తప్పుకోగా ఆమె ప్లేస్ లో కాజల్ ని తీసుకున్నారు.

సుమారు17 ఏళ్ల గ్యాప్ తర్వాత త్రిష చిరంజీవితో జోడి కడుతుండడం గమనార్హం.త్రిష తెలుగులో చివరగా 'నాయకి' అనే సినిమా చేసింది. ఇది లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్. 2016లో ఈ సినిమా రిలీజ్ అయింది. కానీ ఆశించిన రిజల్ట్ అందుకోలేకపోయింది. దాంతో టాలీవుడ్ కి గుడ్ బై చెప్పి కోలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. అక్కడ వరుస సినిమాలతో బిజీ అవుతూ ఇటీవల కాలంలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది. ఇక 'విశ్వంభర'తో ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ త్రిష టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా సక్సెస్ అయితే త్రిష మళ్లీ టాలీవుడ్ లో హీరోయిన్ గా బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: