పంజాబ్ జట్టులో.. నాకు ఇష్టమైన ప్లేయర్ అతనే : ప్రీతి జింటా

praveen
ప్రస్తుతం ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ జట్టు అభిమానులు అందరిని నిరాశపరిచే విధంగానే ప్రదర్శన చేస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన ఈ జట్టు ఇక ఈసారి కూడా అంచనాలను అందుకోలేకపోయింది. మొదట్లో పరవాలేదు అనిపించినప్పటికీ ఆ తర్వాత వరస ఓటములతో సతమతమై అభిమానులను నిరాశ పరుస్తుంది. కనీసం అటు ప్లే ఆఫ్ లో అయినా అడుగు పెడుతుందా లేదా అనే విషయంపై అనుమానాలు నెలకొన్నాయి అని చెప్పాలి.

 అయితే పంజాబ్ కింగ్స్ ఇరా వరుస ఓవటములతో సతమతమవుతున్న నేపథ్యంలో.. ఇక ప్రతి మ్యాచ్ కూడా డగ్ అవుట్ లో కూర్చుని వీక్షిస్తున్న ఈ జట్టు కో ఓనర్ బాలీవుడ్ హీరోయిన్ ప్రీతిజింటా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నారు. ఎందుకంటే పంజాబ్ ఓడినప్పుడు ఆమె నిరాశతో ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ వైరల్ గా మారిపోతున్నాయి. ఇకపోతే ఇటీవల  ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. పంజాబ్ కింగ్స్ జట్టు గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే పంజాబ్ కింగ్స్ లో తనకు ఇష్టమైన క్రికెటర్ ఎవరు అనే ప్రశ్న ఎదురవగా ఆసక్తికర సమాధానం చెప్పింది ఈ బాలీవుడ్ హీరోయిన్.

 పంజాబ్ కింగ్స్ జట్టులో తనకు ఇష్టమైన క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అంటూ ఆ జట్టు ఓనర్ ప్రీతిజింతా చెప్పుకొచ్చింది. అలాగే ఆడం గిల్ క్రిస్ట్ అంటే కూడా ఎంతో ఇష్టం అంటూ తెలిపింది. ప్రస్తుతం తమ జట్టు ప్రదర్శన పట్ల సంతోషంగా లేను అంటూ చెప్పుకొచ్చింది ప్రీతి జింటా. ఇకపోతే ఇప్పటివరకు ఐపీఎల్ సీజన్ లో 11 మ్యాచ్లు ఆడిన పంజాబ్ కింగ్స్ జట్టు.. కేవలం నాలుగు విజయాలు మాత్రమే సాధించింది  ఈ క్రమంలోనే పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో కొనసాగుతుంది. దీంతో ఈసారి కూడా కప్పు కల నెరవేరేలా లేదు అని ఆ జట్టు అభిమానులందరూ  కూడా నిరాశలో మునిగిపోతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Upl

సంబంధిత వార్తలు: