మెగా హీరో సినిమా ఆగిపోయిందా..

Anilkumar
సుప్రీమ్ హీరో, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గత ఏడాది 'విరూపాక్ష' మూవీతో కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. తేజు యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ అందుకొని హీరోగా సాయి తేజ్ లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ సినిమా తర్వాత మామ పవన్ కళ్యాణ్ తో కలిసి 'బ్రో' సినిమాలో నటించాడు. సముద్ర ఖని డైరెక్ట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. కానీ సినిమాలో తేజు నటనకు మంచి మార్కులు పడ్డాయి. బ్రో మూవీ తర్వాత సంపత్ నందితో 'గాంజా శంకర్' అనే సినిమాని అనౌన్స్ చేశాడు తేజు. 

ఆమధ్య ఈ మూవీకి సంబంధించి చిన్న గ్లింప్స్ వీడియో కూడా రిలీజ్ అయింది. అందులో సాయి ధరమ్ తేజ్ మాస్ మెకోవర్ మెగా ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించాల్సిన ఈ ప్రాజెక్టు ఇప్పుడు ఆగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకు కారణం సాయి ధరంతేజ్ అని టాక్ వినిపిస్తోంది. మ్యాటర్ ఏంటంటే.. 'గాంజా శంకర్' కోసం తేజు రెమ్యూనరేషన్ గా 15 కోట్లు డిమాండ్ చేయడంతో ఈ సినిమా ఆగిపోయింది అంటూ ఫిలిం సర్కిల్స్ లో ప్రచారం ఊపు అందుకుంది. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది తెలియదు. కానీ రెమ్యునరేషన్ ఓకే అనుకున్న తర్వాతే సాయి ధరమ్ తేజ్

ఈ ప్రాజెక్టుకు సైన్ చేసాడని, ఆ తర్వాతే అఫీషియల్ గా అనౌన్స్ చేశామంటూ మూవీ టీమ్ అంటుందట. మరోవైపు ఈ ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లో ఆగదని, కాకపోతే సినిమా నుంచి హీరోయిన్గా పూజ హెగ్డే తప్పుకుందని సమాచారం. ఈ మూవీలో హీరోయిన్ ఎక్కువ సమయంలో జైలులో ఖైదీగా కనిపించాలట. అది కూడా వైట్ శారీలో డీ గ్లామర్ లో కనిపించాల్సి ఉంటుందట. డి గ్లామరస్ రోల్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించని పూజ హెగ్డే ముందుగానేఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై కూడా ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మొత్తంగా సాయి తేజ్ లేటెస్ట్ మూవీ 'గాంజా శంకర్' పై రకరకాల రూమర్స్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొట్టడంతో ఫ్యాన్స్ సైతం ఏది నిజమో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారు. మరి మూవీ టీం దీనిపై త్వరలోనే క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: