'గుంటూరు కారం' మూవీ గూర్చి షాకింగ్ కామెంట్స్ చేసిన సీనియర్ డైరెక్టర్....!!

murali krishna
మహేష్ బాబు హీరో గా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్  దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి పండుగ ను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం గుంటూరు కారం .మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం ఈ సినిమా రాబోతున్న నేపథ్యం లో ఈ సినిమాపై భారీ స్థాయి లో అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా విడుదల అయ్యి ప్రేక్షకులను నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. ఆ సమయం లో త్రివిక్రమ్ పై ఎన్నో విమర్శలు వచ్చాయి.ఇకపోతే తాజా గా ఈ సినిమా పై ప్రముఖ దర్శకుడు కృష్ణ రెడ్డి ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ సినిమా చేసేటప్పుడు ఎప్పుడు కూడా హీరోని నమ్మి సినిమా చేయకూడదు.హీరో ని నమ్మి సినిమా చేస్తే ఫలితం ఇలానే ఉంటుంది. అందుకే ఎప్పుడూ కూడా హీరో లను నమ్మి సినిమాలను తీయకూడదు.  గతం లో నేను సినిమా కథ ను నమ్మి చేశాను ఆ  సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక నాగార్జున వంటి స్టార్ హీరోలను నమ్మి సినిమా చేశాను. అయితే ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది.ఒక దర్శకుడు ఎప్పుడు కూడా హీరోల స్టామినా దృష్టి లో పెట్టుకొని సినిమా చేయకూడదు.ఎప్పుడు కూడా సినిమా కథను నమ్మి చేస్తేనే సినిమా హిట్ అవుతుంది. ఇక గుంటూరు కారం సినిమా విషయం లో అలాగే జరిగింది. త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్ సూపర్ స్టార్ మహేశ్ వంటి హీరో తో సినిమా చేస్తున్న తరుణం లో మహేష్ స్టామినా దృష్టి లో పెట్టుకొని చేశాడు. అందుకే సినిమా ఫలితం అలా ఉంది అంటూ కృష్ణా రెడ్డి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: