పుష్ప సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది రష్మిక మందన. ఆ తరువాత యానిమల్ సినిమాలో నటించి డైరెక్ట్గా బాలీవుడ్ హీరోయిన్ అని అనిపించుకుంది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్గా నటించినందుకు రష్మిక మందనకి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ లభించింది. ఆ సినిమాలో గీతాంజలి అని పాత్రలో ఒదిగిపోయింది రష్మిక మందన. అంతేకాదు ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో రష్మిక మందన కి ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈ బ్యూటీ.
ఇక ఇంటర్వ్యూలో భాగంగా తన సహ నటులు అమితా బచ్చన్ రన్బీర్ కపూర్ విజయ్ దేవరకొండ అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల పై కామెంట్స్ చేసింది. ఇందులో భాగంగానే ఆమె మాట్లాడుతూ.. విజయ్ దేవరకొండతో తనకు ఉన్న అనుబంధాన్ని రష్మిక ఇలా చెప్పింది. ' కెరీర్లో నేను ఎంతో కష్టపడే వచ్చాను. నేను చేసే ప్రతి పనిలో విజయ్ సహకారం ఎప్పుడూ ఉంటుంది. నేను ఏదైనా ఒక పని చేయాలని అనుకుంటే ఆ సమయంలో తప్పకుండా అతని సలహా తీసుకుంటాను. అది నాకు ఎంతో అవసరం కూడా.. ఆ సమయంలో నాకు ఏది మంచో, ఏది చెడో వివరిస్తాడు. వ్యక్తిగతంగా నా జీవితంలో అందరికంటే ఎక్కువగా సపోర్ట్ చేసిన వ్యక్తి విజయ్.'
అని రష్మిక తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నాల నిశ్చితార్థం జరగనుందని, వీరి వివాహ తేదీని కూడా త్వరలోనే ప్రకటిస్తారనే వార్తలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ స్పందించారు. ఈ ఫిబ్రవరిలో ఎవరితోనూ తన నిశ్చితార్థం లేదని. తన పెళ్లి గురించిన పుకార్లు తరచూ వస్తూనే.. వినిపిస్తూనే ఉన్నాయని క్లారిటీ ఇచ్చాడు. 'ఫ్యామిలీ స్టార్' చిత్రంతో విజయ్ బిజీగా ఉంటే.. మరోవైపు రష్మక కూడా బాలీవుడ్ డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కిస్తున్న 'ఛావా' చిత్రంలో విక్కీ కౌశల్తో కలసి నటిస్తుంది.