తెలుగు హీరోయిన్ కి దర్శకుడికి మధ్య మాటల యుద్ధం

Anilkumar
తెలుగమ్మాయి అయిన ఐశ్వర్య రాజేష్ పలు తమిళ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. సహాయ నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన ఈమె ఆ తర్వాత హీరోయిన్గా మారి పలు సూపర్ హిట్ సినిమాలతో మంచి సక్సెస్ అందుకుంది. తెలుగులో ఒకటి, రెండు సినిమాల్లో నటించినా ఇక్కడ పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే తమిళంలో మాత్రం ఓవైపు అగ్ర హీరోలతో నటిస్తూనే మరోవైపు లేడి ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్ చేస్తూ దూసుకుపోతుంది. ఈమధ్య ఎక్కువగా మహిళా ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేస్తూ కోలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కి కేరాఫ్ అడ్రస్ గా మారింది. అలా ప్రస్తుతం తమిళంలో మంచి క్రేజ్ తో దూసుకుపోతున్న ఐశ్వర్య రాజేష్ దర్శకుడు వీర పాండియన్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది.

వీర పాండియన్ 2011లో 'అవర్ గలుమ్ ఇవర్ గలుమ్' అనే సినిమా తీశాడు. ఇందులో ఐశ్వర్య రాజేష్ ఓ హీరోయిన్గా నటించింది. తాజాగా ఓ మీడియా ప్రకటనలో భాగంగా ఈ డైరెక్టర్ ఐశ్వర్య రాజేష్ ని ఇండస్ట్రీకి పరిచయం చేశానని, ఈ విషయాన్ని ఆమె ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదని, ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయిన తర్వాత నా సినిమాలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించలేదని, ఆమె ఆర్థికంగా కష్టపడుతున్న సమయంలో ఆటో ఖర్చులకు కూడా నేనే డబ్బులు ఇచ్చానని.. చెప్పాడు. ఇక దీనిపై పరోక్షంగా ఐశ్వర్య రాజేష్ స్పందిస్తూ డైరెక్టర్ వీర పాండియన్ పేరు చెప్పకుండా పోస్ట్ చేసింది." చాలామంది ఓ అంశాన్ని మాత్రమే విని మాట్లాడుతున్నాను.

 అసలు విషయాలు ఏమీ తెలుసుకోకుండా ఓ నిర్ణయానికి వచ్చి జీవితంలోని అనుబంధాలను చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా సరే పూర్తిగా తెలుసుకుని ఆరోపణలు చేస్తే బాగుంటుంది" అంటూ తన పోస్ట్లో పేర్కొంది. దీంతో ఐశ్వర్య రాజేష్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.ఐశ్వర్య రాజేష్ ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో తెలుగు సినిమాల గురించి మాట్లాడింది." తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే నాకు చాలా ఇష్టం. తెలుగులో సినిమా చేస్తే కచ్చితంగా అది నా ఫ్యామిలీ గర్వపడే మూవీ అయి ఉండాలని అనుకున్నా. అలా తెలుగులో ఎన్నో ఏళ్లు అవకాశం కోసం ఎదురు చూశాక వరల్డ్ ఫేమస్ లవర్ లో నటించే ఛాన్స్ వచ్చింది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: